Tv424x7
Andhrapradesh

గుడిపాడు లో ఘనంగా జిల్లాస్థాయి లగోరి సెలక్షన్స్

కడప జిల్లా దువ్వూరు మండలం గుడిపాడు గ్రామంలోని శ్రీ శంకరాచార్య హై స్కూల్ నందు శనివారం జిల్లాస్థాయి లగోరి సెలక్షన్స్ నిర్వహించడం జరిగింది. జిల్లా స్థాయి సెలక్షన్స్ ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ బద్వేలి రామకృష్ణారెడ్డి గారు ప్రారంభించడం జరిగింది తదనంతరం పది గంటలకు సెలక్షన్స్ ప్రారంభం కాగా జిల్లా వ్యాప్తంగా దాదాపు పది పాఠశాలలు పాల్గొనగా మధ్యాహ్నం భోజన విరామ సమయం వరకు సెలక్షన్స్ జరిగాయి ఈ సెలక్షన్స్ కార్యక్రమాన్ని కడప జిల్లా లగోరి సెక్రటరీ ఈర్ల సంజీవ రాయుడు పర్యవేక్షణలో మరియు వనిపెంట జడ్పీ హైస్కూల్ వ్యాయామ ఉపాధ్యాయులు మూడే రామ్ నాయక్ రిఫరీగా నిర్వహించడం జరిగింది. జిల్లా వ్యాప్తంగా దాదాపు 200 మంది విద్యార్థులు పాల్గొనగా వారందరికీ శ్రీ శంకరాచార్య హై స్కూల్ యాజమాన్యం ఏర్పాట్లు చేయడం జరిగింది ముగింపు సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ మూలే రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు కేవలం బహుమతుల కోసమే కాకుండా జీవితాంతం ఏదో ఒక ఆటను కొనసాగిస్తే అనేక వ్యాధులకు దూరంగా ఉంటూ శారీరక దృఢత్వాన్ని పొందుతారని తద్వారా ప్రస్తుత తరుణంలో విరివిగా చూస్తున్న గుండె జబ్బులు తదితర సమస్యల నుంచి గట్టు ఎక్కవచ్చని తెలిపారు కార్యక్రమం చివరిలో సాంస్కృతిక కార్యక్రమాలు అతిధులకు సన్మాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది

Related posts

వైఎస్ఆర్‎కు ఘన నివాళి.. జగన్, షర్మిలతో తల్లి విజయమ్మ.

TV4-24X7 News

ఉచిత సిలిండర్ల అమలు అప్పటి నుంచే

TV4-24X7 News

కంప్లైంట్ ఇచ్చిన 24 గంటలు లోపల బాలుడు యొక్క ఆచూకీ కనిపెట్టి వన్ టౌన్ పోలీసులు

TV4-24X7 News

Leave a Comment