Tv424x7
Andhrapradesh

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌

మరో నాలుగు నెలలకు సంబంధించి ఈ బడ్జెట్‌ను తీసుకొచ్చింది. సూపర్ సిక్స్ సహా కీలక పథకాలకు ఈ బడ్జెట్‌‌లో కేటాయింపులు జరిగాయి. మహిళలకు సూపర్‌సిక్స్‌ పథకాల అమల్లో భాగంగా.. మరో కీలక హామీకి సంబంధించి ప్రభుత్వం బడ్జెట్‌లో నిధులు కేటాయించింది. రాష్ట్రవ్యాప్తంగా 19 ఏళ్ల నుంచి 59 ఏళ్ల మధ్య ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన మహిళలకు ఆడబిడ్డ నిధి కింద నెలకు రూ.1,500 చొప్పున ఆర్థికసాయం అందిస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే.కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు.. ఈ పథకానికి అప్పట్లో ఆడబిడ్డ నిధి/మహిళాశక్తిగా పేరు పెట్టింది. ఇప్పుడు ప్రభుత్వం 2024-25 బడ్జెట్‌లో ‘మహిళలకు ఆర్థిక సహకారం’ పేరుతో ఆయా వర్గాలకు చెందిన వారికి రూ.3,341.82 కోట్లు కేటాయించింది. బీసీ మహిళలకు రూ.1099.78 కోట్లు, ఎస్సీ మహిళలకు రూ.1198.42 కోట్లు, గిరిజన మహిళలకు రూ.330.10 కోట్లు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు రూ.629.37 కోట్లు, మైనారిటీలకు రూ.83.79 కోట్లు ప్రతిపాదించింది. జెండర్‌ బడ్జెట్‌లో ఈ నిధుల్ని ప్రత్యేకంగా చూపించింది ప్రభుత్వం.మరోవైపు ఎన్డీయే ఎన్నికల మ్యానిఫెస్టో ప్రకారం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీపై మంత్రి కొలుసు పార్థసారథి కీలక ప్రకటన చేశారు. ఈ ఆర్థిక సంవత్సరం నుంచే ఈ పథకాన్ని అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. ఈ బడ్జెట్‌లో తల్లికి వందనం పథకానికి రూ.6,487 కోట్లు, అన్నదాత సుఖీభవకు రూ.వెయ్యి కోట్లు కేటాయించిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ బడ్జెట్‌లో ప్రాధాన్య క్రమంలో నిధులు కేటాయించినట్లు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థికంగా అనేక ఇబ్బందులున్నా ఎన్నికల హామీల అమలుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. తమ ప్రభుత్వం ముందు ఎన్నో సవాళ్లున్నాయని.. ఇలాంటి సమయంలో బడ్జెట్‌ ప్రవేశపెట్టామన్నారు.ఏపీ ఎన్నికల సమయంలో కూటమి పార్టీలు మహిళలకు ప్రతి నెల డబ్బుల్ని అకౌంట్‌లో జమ చేస్తామని సూపర్ సిక్స్‌లో భాగంగా హాామీ ఇచ్చింది. 18 నుంచి 59 సంవత్సరాల్లోపు వయసున్న ప్రతి మహిళకు నెలకు రూ.1500 ఈ పథకం ద్వారా అందిస్తామని చెప్పింది. ఈ పథకానికి మహాశక్షి, ఆడబిడ్డ నిధి పేర్లు ఖరారు చేసింది. త్వరలోనే ఈ పథకానికి విధివిధానాలు ప్రకటించి.. దరఖాస్తుల్ని ఆహ్వానించాలని భావిస్తోంది. అంతేకాదు మహిళలకు ఇచ్చిన మరో హామీ ఉచిత బస్సు ప్రయాణంపై కూడా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇప్పటికే ఈ పథకం అమలు చేస్తున్న పలు రాష్ట్రాల్లో అధికారులు పర్యటించి.. అమలు తీరుపై ఆరా తీశారు. త్వరలోనే విధివిధానలు ఖరారు చేయనున్నారు.

Related posts

ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత వైఎస్ఆర్ దే

TV4-24X7 News

స్వచ్చ సర్వేక్షన్ లో భాగంగా స్థానిక మారుతీ నగర్ లో ప్రజలకు అవగాహనా కార్యక్రమం

TV4-24X7 News

తెలుగురాష్ట్రాల్లో విజృంభిస్తున్న హెపటైటిస్

TV4-24X7 News

Leave a Comment