దీన్ని ఖండిస్తూ టీమ్ లడ్డూ అధ్యక్షుడు అబ్దుల్ గపూర్ ఆవేదన
విశాఖపట్నం తానునిస్వార్ధంగా పేద, బడుగువర్గాల ప్రజలకోసం సామాజిక ఉచిత సేవలు చేస్తుంటే వైయస్సార్ పార్టీకి చెందిన ఒక దినపత్రికలో ప్రచురించిన తప్పుడు ఆరోపణలపై టీమ్ లడ్డూ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు అబ్దుల్ గపూర్ ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం డాబాగార్డెన్స్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మా సంస్థ టీమ్ లడ్డూ వెల్ఫేర్ సొసైటీ సామాజిక సేవకోసం సేకరించిన నిధులు దుర్వినియోగం చేసి, అవినీతి కార్యకలాపాలకు ఎమ్మెల్యే, ఎంపీ కి నిధులు మళ్లీంచారనే తప్పుడుఆరోపణలు ఒకపత్రిక ప్రచురించిన నేపథ్యంలో తప్పుడు ఆరోపణలపై ఖండన తెలియజేస్తున్నామన్నారు. ఈ నెల 13 తేదీన యదేచ్చగా అక్రమ దందా పేరిట తప్పుడు వార్త రాశారని, ప్రతి నెల తాను 500 మంది పేదలకు నిత్యావసరాలు పంపిణీ చేస్తున్నట్లు పేర్కొ న్నారు. ఇంతే కాకుండా అనాధ మృతదేహాలకు ఉచిత అంత్యక్రియలు, – వైద్యసేవలు, అంబులెన్సు సేవలు అందిస్తున్నట్లుతెలిపారు. వేసవిలో మజ్జిగ పంపిణీ చేస్తున్నామన్నారు. అన్న, వస్త్రధానాలు చేస్తున్నామన్నారు. నిరుపేద యువతి పెళ్లిళ్లకు సాయం చేస్తున్నామన్నారు. హిందువులకు కూడా సేవలు అందిస్తున్నామన్నారు. ఈ సమావేశంలో సొసైటీ సభ్యుడుదుర్గా ప్రసాద్, మాట్లాడుతూ, ఏ సమస్య వున్నా గపూర్ కి చెప్పుంటే ఆయన సమస్యలు పరిష్కరిస్తున్నారని తెలిపారు. సుప్రీం కోర్టు న్యాయవాది (ప్రాక్టీసు) ఎం.జి.ఎం.ఖాన్ మాట్లాడుతూ, మానవ సేవే మాధవ సేవ నానుడి నిజం చేస్తూ, గపూర్ సేవా కార్యక్రమాలను చేయడం అభినందనీయ మన్నారు. అటువంటి మంచి వ్యక్తిపై పత్రికల్లో ఆరోపణలు చేయడం తగదన్నారు. మీడియా సమావేశంలో 39 వార్డు ప్రజలు దమయంతి, సతీష్, సలీం, మదీనా, అస్లాం, మహ్మద్ గౌస్, తదితరులు పాల్గొన్నారు.