Tv424x7
Andhrapradesh

ప్రభుత్వ సిమెంట్ రోడ్డు కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలి: అడ్వకేట్ నానుబాల శ్రీనివాసులు

కడప జిల్లా మైదుకూరు పట్టణం, ప్రొద్దుటూరు రోడ్డు లోని చాకలివీధి సిమెంట్ రోడ్డు నుండి పాల మాబువీధికి వెళ్ళే సిమెంట్ రోడ్లను ఆక్రమించి రోడ్డుపై కంప వేసి, అడ్డుగా ఇనుప తంతెలువేశారు వీటిని వెంటనే తొలగించి, ప్రజల రాకపోకలకు ఆటంకం కల్గించిన వారిపై చర్యలు తీసుకోవాలని అడ్వకేట్ నానుబాల శ్రీనివాసులు డిమాండ్ చేశారు. ప్రభుత్వ స్థలాలను పేదలు, చిన్న వ్యాపారస్తులు జానెడు స్థలాని ఆక్రమిస్తే ఎక్కడలేని చట్టాలు తెసుకోచ్చే మున్సిపల్ అధికారులు, మైదుకూరు నడిబొడ్డున ఉండేటువంటి చాకలవీధి సిమెంట్ రోడ్లను ఆక్రమించిన వారిపై చర్యలు ఎందుకు తీసుకోలేదో తెలియడం లేదు.దాదాపు ఎనిమిది నెలల నుండి మీకు అర్జీలు ఇస్తున్న, మీ కార్యాలయం చుట్టూ తిరిగినా కళ్ళు ఉండి గుడ్డివారిగా నటిస్తున్నారని అడ్వకేట్ నానుబాల శ్రీనివాసులు ఆరోపించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ ఈ కబ్జాదారులను నియంత్రిచడం లో మైదుకూరు మునిసిపల్ అధికారులు పూర్తిగా విఫలం అయ్యారు అని అధికారులు కబ్జాదారులకు వంతపడుతున్నారని అయన ఎద్దవ చేశారు. అధికారులకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్న ప్రభుత్వ సిమెంట్ రోడ్లపై అక్రమంగా నిర్మించిన ఇనుప కంచెలు వెంటనే తొలగించాలని హెచ్చరించారు. ప్రభుత్వ సొమ్ముతో నిర్మించిన సిమెంట్ రోడ్లను ఆక్రమించిన రాబందులకు చట్టాలు వర్తించవా…? పేదలకు ఒక న్యాయము, అధికారము అంగ బలము ఉన్నవారికి ఒక ఒక న్యాయమా…..? చట్టం, న్యాయం అందరికి సమానంగా ఉంటాయని ఇకనైనా మైదుకూరులోని అధికారులు మేలుకోకపోతే జరిగే పరిణామాలకు అధికారులే బాద్యత వహించాల్సి వస్తుందని వారు హితవు పలికారు. ప్రభుత్వ స్తలాలు, రోడ్లు పరిరక్షణ కోసం అవసరమైతే హైకోర్ట్ లో పబ్లిక్ లిటిగేషన్ పిల్ ఫైల్ చేస్తామని తెలిపారు.

Related posts

విద్యాకానుక’ రెడీ.. 12న పంపిణీకి ఏర్పాట్లు

TV4-24X7 News

ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరి పాటించాలి వన్ టౌన్ ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది

TV4-24X7 News

18 లక్షలు సుపారీ ఇచ్చి భర్తను హత్య చేయించిన భార్య

TV4-24X7 News

Leave a Comment