కార్యక్రమంలో కేంద్రమంత్రి, ఎమ్మెల్యేలతో పాల్గొన్న సౌత్ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్
విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రసాద్ రెడ్డి పై చర్యలు తీసుకోవాలని కోరుతూ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ రాష్ట్ర మంత్రి లోకేష్ కి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఎమ్మెల్యేలతో విశాఖ సౌత్ ఎమ్మెల్యే శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆంధ్రా యూనివర్సిటీని భ్రష్టు పట్టించిన మాజీ వీసీ ప్రసాద్ రెడ్డి పై తగు చర్యలు చేపట్టాల్సిందిగా కోరారు. 2019 నుంచి 2024 వరకు జరిగిన అనేక విషయాలపై చర్యలు తీసుకోవాలని విన్నవించారు. ఆంధ్రా యూనివర్సిటీని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి కార్యాలయం గా తయారుచేసిన ఘనత అప్పటి వీసి ప్రసాదరెడ్డి గొప్ప తనం అని అన్నారు. ఎన్నికల్లో అభ్యర్థి ఎన్నిక నుంచి, ఎల్లెక్షన్ జరిగేంత వరకు కీలక పాత్ర పోషించిన విషయాన్ని మంత్రి కి తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా అనేక కార్యక్రమాలు చేపట్టి , విద్యా వ్యవస్థ కు రాజకీయ రంగు పులిమిన ఇలాంటి వాటిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రివర్యులు రామ్మోహన నాయుడు, ఈస్ట్ ఎమ్మేల్యే రామకృష్ణ బాబు, వెస్ట్ ఎమ్మేల్యే గణబాబు పాల్గొన్నారు.