Tv424x7
National

ఈ రాజ్యాంగ సవరణలు పూర్తయితే.. అతి త్వరలోనే జమిలి ఎన్నికలు.

‘వన్ నేషన్.. వన్ ఎలక్షన్..’ జమిలి ఎన్నికలు అతి త్వరలో రాబోతున్నాయి.. 2027లోనే జమిలి ఎన్నికలు రావొచ్చనే సంకేతాలు కేంద్రం నుంచి వస్తున్నాయి. దీనికి కారణం లేకపోలేదు.వన్ నేషన్.. వన్ ఎలక్షన్‌కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. జాయింట్ పార్లమెంటరీకి ఈ బిల్లు పంపింది. అంతేనా.. ప్రస్తుతం జరుగుతున్న శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లోనే ఈ బిల్లును పార్లమెంట్ లో పెట్టాలని ఆల్ మోస్ట్ డిసైడ్ అయ్యింది కేంద్రం.ఇక్కడే ఓ బిగ్ ట్విస్ట్ ఉంది. వన్ నేషన్.. వన్ ఎలక్షన్ బిల్లు అమల్లోకి రావాలంటే.. అంతకంటే ముందే ఆరు అంశాలపై రాజ్యాంగాన్ని సవరించాల్సి ఉంది. ఈ బిల్లు ఆమోదం సమయంలోనే.. ఆ ఆరు అంశాలకు సంబంధించి.. రాజ్యాంగ సవరణలకు పార్లమెంట్ ఓకే చెప్పాల్సి ఉంటుంది. అవేంటో చూద్దాం..

రాజ్యాంగ సవరణలు చేయాల్సిన అంశాలు:

లోక్‌సభ, రాజ్యసభ కాలపరిమితికి సంబంధించిన ఆర్టికల్ 83 సవరణ, రాష్ట్రాల అసెంబ్లీలకు ఐదేళ్ల గడువును నిర్దేశించే ఆర్టికల్ 172(1)ని సవరించడం.

ఎమర్జన్సీ లాంటి పరిస్థితుల సమయంలో సభ కాల పరిమితిని ఏడాదికి మించకుండా పార్లమెంటు చట్టం ద్వారా వీలు కల్పించే ఆర్టికల్ 83(2)ని సవరణ చేయడం.

లోక్‌సభను రద్దు చేసే.. రాష్ట్రపతికి అధికారాలిచ్చే ఆర్టికల్ 85 (2) (బి)ని సవరణ చేయాలి.

రాష్ట్ర అసెంబ్లీల రద్దు అధికారం గవర్నర్‌కు ఉండే ఆర్టికల్ 174 (2) (బి)కి సవరణ చేయాలి.

రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలనకు వీలు కల్పించే ఆర్టికల్ 356కి సవరణ చేయాలి.

ఎన్నికల కమిషన్‌కు సంబంధించిన ఆర్టికల్ 324ను సవరించాల్సి ఉంది. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 1957, 1962, 1967లో జరిగినవి జమిలి ఎన్నికలే. దేశం మొత్తం ఒకేసారి జరిగాయి. ఆ తర్వాత నుంచి పరిస్థితులు మారిపోయాయి. 1980లోనే జమిలి ఎన్నికల అంశం తెరపైకి వచ్చింది. ఆ తర్వాత 1999లో లా కమిషన్ సైతం జమిలికి జై కొట్టింది. అయినా అమలు సాధ్యం కాలేదు. ఆ తర్వాత మోదీ ప్రధాని అయినప్పటి నుంచి బీజేపీ దీనిని లేవనెత్తుతోంది, 2014 బీజేపీ మేనిఫెస్టోలో జమిలి హామీ ఉంది. ఇప్పుడు ఆ దిశగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్నది. కేంద్ర కేబినెట్ ఆమోదం పొందింది. దేశంలోని 14 రాష్ట్ర ప్రభుత్వాలు ఆమోదం పొందాల్సి ఉంది. ప్రస్తుతం దేశంలో చాలా రాష్ట్రాల్లో బీజేపీనే అధికారంలో ఉన్నది. సో.. దీనికి పెద్దగా సమస్య ఉండదు. వన్ నేషన్.. వన్ ఎలక్షన్ బిల్లు విషయంలో కేంద్రంలోని మోదీ ప్రభుత్వం దూకుడు చూస్తుంటే.. 2027లోనే జమిలి ఎన్నికలు పెట్టేసే అవకాశం కూడా లేకపోలేదు.

Related posts

తమిళనాడు బీఎస్పీ పార్టీ అధ్యక్షుడు ఆర్మ్‌స్ట్రాంగ్ దారుణ హత్య?

TV4-24X7 News

రేవ్ పార్టీ ఎంట్రీ ఫీజు రూ.50లక్షలు: సీపీ

TV4-24X7 News

గూగుల్ సెర్చ్ టాప్‌లో పవన్ కల్యాణ్

TV4-24X7 News

Leave a Comment