ఏపీ రాష్ట్రంలో పదోతరగతి పరీక్షలు మార్చి 17 నుంచి 31 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఇప్పుడు ప్రకటించిన షెడ్యూల్లో స్వల్ప మార్పులు జరిగే అవకాశముంది. మార్చి 31న సోషల్ స్టడీస్ ఎగ్జామ్ రోజున ప్రభుత్వం కేలండర్లో రంజాన్ హాలిడేగా పేర్కొంది. ఒకవేళ 31న నెలవంక కనపడి పండగవస్తే ఏప్రిల్ 1న ఎగ్జామ్ నిర్వహిస్తామని ప్రభుత్వ పరీక్షల విభాగసంచాలకులు శ్రీనివాసులు రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు.

previous post