Tv424x7
National

ఎన్.ఆర్.ఐ.లకు అండగా ఉంటాం..ఖతార్ టీడీపీ శ్రేణుల సమావేశంలో ఎమ్మెల్యే అమిలినేని

ఎన్.ఆర్.ఐ.లకు ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం తగిన సహాయ సహకారాలు అందిస్తుందని కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు అన్నారు. ఖతార్ లో ఎన్.ఆర్.ఐ. టీడీపీ స్థానికంగా ఏర్పాటు చేసిన పార్టీ సమావేశంలో *ఎమ్మెల్యే అమిలినేని, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావు* తో కలసి పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే అమిలినేని మాట్లాడుతూ ఒక దుర్మార్గ ప్రభుత్వాన్ని గద్దె దించడానికి వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రవాసాంధ్రులు పోలింగ్ రోజున వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకోవడం చారిత్రాత్మక విషయమని పేర్కొన్నారు. స్థానికంగా ఉంటూ కూటమికి మద్దతు ఇవ్వడం ఒక ఎత్తయితే విదేశాల నుంచి వచ్చి అండగా నిలబడడం అరుదైన విషయమని అభివర్ణించారు. ఇంతటి అభిమానం కారణంగానే కూటమికి చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో 164 సీట్లు వచ్చాయని తెలిపారు. జగన్ హయంలో అస్తవ్యస్తంగా మారిన రాష్ట్రాన్ని మళ్లీ అభివృద్ధి పట్టాలెక్కించి, దేశంలో నెంబర్ వన్ గా నిలబెట్టడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిరంతరం శ్రమిస్తున్నారని అన్నారు. ఖతార్ లోని ప్రవాసాంధ్రులకు అవసరమైన అంశాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యేలు అమిలినేని సురేంద్ర బాబు గారిని, గంటా శ్రీనివాస రావు గారిని ఖతార్ టీడీపీ, జనసేన నాయకులు సన్మానించారు.

Related posts

జొమాటోకు షాక్.. రూ. 803 కోట్ల జీఎస్‌టీ కట్టాలని నోటీసులు

TV4-24X7 News

ఢిల్లీ చలో’ కు విరామం..

TV4-24X7 News

త్వరలో కూతపెట్టనున్న హైడ్రోజన్ రైలు

TV4-24X7 News

Leave a Comment