మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ (92) అస్తమయం.. ప్రధానిగా, ఆర్థిక మంత్రిగా, రాజ్యసభ సభ్యుడిగా, వాణిజ్య మంత్రిత్వశాఖ సలహాదారుగా, ఆర్థికశాఖ ప్రధాన సలహాదారుగా, ఆర్థిక మంత్రిత్వశాఖ కార్యదర్శిగా, ప్రణాళిక సంఘం ఛైర్మన్గా, ఆర్బీఐ గవర్నర్గా, ప్రధాని సలహాదారుగా, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిటీ చైర్మన్ వంటి బాధ్యతలు నిర్వహించిన మన్మోహన్ సింగ్కొంతకాలంగా తీవ్ర అనారోగ్యం తో బాధపడుతున్న మన్మోహన్ సింగ్.. ఇంట్లో అకస్మాత్తుగా స్పృహకోల్పోయిన మన్మోహన్.. రాత్రి 8:06 గంటలకు ఎయిమ్స్లోని మెడికల్ ఎమర్జెన్సీకి తరలింపు.. రాత్రి 9:51 గంటలకు మన్మోహన్ కన్నుమూసినట్టు ఎయిమ్స్ ప్రకటన..1932 సెప్టెంబర్ 26న అవిభక్త భారత్లోని పంజాబ్ రాష్ట్రం లో జన్మించిన మన్మోహన్ సింగ్.. 2004 నుంచి 2014 వరకు ప్రధానిగా సేవలు అందించిన మన్మోహన్.. దేశాన్ని సుదీర్ఘకాలం పాలించిన ప్రధానుల్లో మన్మోహన్ ఒకరు.. 1991 నుంచి 1996 వరకు పీవీ కేబినెట్లో ఆర్థికమంత్రిగా సేవలు.. ఎన్నో ఆర్థిక సంస్కరణలు చేపట్టిన వ్యక్తిగా మన్మోహన్కు పేరు.. 1991 అక్టోబర్లో తొలిసారిగా రాజ్యసభలో అడుగు.. ఐదు సార్లు అసోం నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించిన మన్మోహన్ సింగ్
