విశాఖపట్నం యువ సేవ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఓ అనాథ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. విశాఖ రైల్వే స్టేషన్ రెండో నంబర్ గేట్ వద్ద ఓ వృద్ధుడు మృతి చెందగా ఆయనకు ఎవరూ లేరని, అనాథ అని జీఆర్పీ సిబ్బంది ద్వారా తెలుసుకున్నారు. దీంతో యువసేవ ఫౌండర్ పీలా హరి ప్రసాద్ చొరవ చూపించి అనాథ మృతదేహాన్ని జ్ఞానాపురం శ్మశాన వాటికలో అంత్యక్రియలు జరిపించారు. 60 నుంచి 70ఏళ్ల వయస్సుండే ఆ పెద్దాయనకు మేమున్నామంటూ యువసేవ సంఘం సభ్యులు, జీఆర్పీ కానిస్టేబుల్, శ్మశాన వాటిక శానిటరీ ఇన్స్పెక్టర్ ప్రసన్నకుమార్, సిబ్బంది సత్యనారాయణ తదితరులు అఖరి స్నానం చేయించారు.
