Tv424x7
Andhrapradesh

అనాథ మృతదేహానికి యువ సేవ

విశాఖపట్నం యువ సేవ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఓ అనాథ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. విశాఖ రైల్వే స్టేషన్ రెండో నంబర్ గేట్ వద్ద ఓ వృద్ధుడు మృతి చెందగా ఆయనకు ఎవరూ లేరని, అనాథ అని జీఆర్పీ సిబ్బంది ద్వారా తెలుసుకున్నారు. దీంతో యువసేవ ఫౌండర్ పీలా హరి ప్రసాద్ చొరవ చూపించి అనాథ మృతదేహాన్ని జ్ఞానాపురం శ్మశాన వాటికలో అంత్యక్రియలు జరిపించారు. 60 నుంచి 70ఏళ్ల వయస్సుండే ఆ పెద్దాయనకు మేమున్నామంటూ యువసేవ సంఘం సభ్యులు, జీఆర్పీ కానిస్టేబుల్, శ్మశాన వాటిక శానిటరీ ఇన్స్పెక్టర్ ప్రసన్నకుమార్, సిబ్బంది సత్యనారాయణ తదితరులు అఖరి స్నానం చేయించారు.

Related posts

రాష్ట్ర వ్యాప్తంగా 2,50,000 వేల దొంగ పెన్షన్లు

TV4-24X7 News

భార్య గొంతు కోసిన భర్త

TV4-24X7 News

స్వర్గీయులు దైవసమానులు పంపాన వంశస్తులు పంపాన నారాయణరావు, రత్నమ్మ, మరియు వారి కుమారులు పంపాన అప్పల ముార్తి బ్రదర్స్ జ్ఞాపకార్థం సంక్రాంతి పండుగ సందర్భంగా అన్న సమర్పణ

TV4-24X7 News

Leave a Comment