Tv424x7
Andhrapradesh

ఆర్టికల్ 370 అంశంపై నేడు తీర్పు

జమ్ము కాశ్మీర్:డిసెంబర్ 11జమ్ము కశ్మీర్ కు స్వయం ప్రతిపత్తి కల్పించే రాజ్యాం గంలోని ఆర్టికల్ 370ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటీషన్లపై సుప్రీం కోర్టు విచారణ ఇప్పటికే పూర్తయింది..ఇవాళ ఈ కీలక అంశంపై తీర్పు వెలువడనుండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. జమ్ము కశ్మీర్ భారతదేశంలో విలీనం సమయంలో అప్పటి సంస్థానాధిపతు లతో కుదిరిన ఒప్పందం మేరకు ఆ రాష్ట్రానికి ప్రత్యేక స్వయం ప్రతిపత్తి కల్పిస్తూ రాజ్యాం గంలో ఆర్టికల్ 370 చేర్చారు.నాలుగున్నరేళ్ల క్రితం అంటే 2019 ఆగస్టు 6న కేంద్రం లోని బీజేపీ ప్రభుత్వం ఆర్టికల్ 370 రద్దు చేసింది. ఈ రద్దును సవాలు చేస్తూ దాఖలైన పిటీషన్లపై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది.సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలో జస్టిస్ ఎస్కే కౌల్, జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ సూర్య కాంత తో కూడిన ధర్మా సనం అన్ని వర్గాల వాదన లు విని తీర్పు రిజర్వ్ చేసింది.ఇవాళ ఆర్టికల్ 370పై సుప్రీంకోర్టు తీర్పు వెలువ డనుంది. ఆర్టికల్ 370 రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై మిశ్రమ స్పందన వ్యక్త మైంది.ఇవాళ తీర్పు వెలువ డనున్న క్రమంలో ముందు జాగ్రత్త చర్యగా జమ్ము కశ్మీర్లో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.కొందరిని అదుపులో తీసుకోగా,మరి కొందరిని గృహ నిర్బంధం చేశారు. 2 వారాల ముందు నుంచే కశ్మీర్ లోయలో పెద్దఎత్తున పోలీసు బలగాల్ని మొహ రించారు.ఇప్పటికే రాష్ట్రం లోని 10 జిల్లాలు పూర్తిగా పోలీసుల నియం త్రణలో ఉన్నాయి…….

Related posts

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాన్వాయిని అడ్డుకున్న వైసీపీ శ్రేణులు..

TV4-24X7 News

ధర్నాచౌక్‌లో PET అభ్యర్థుల ధర్నా.

TV4-24X7 News

జనసేన పెండింగ్‌ స్థానాలపై పవన్‌ కల్యాణ్‌ కసరత్తు

TV4-24X7 News

Leave a Comment