రూ.30 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన రాజంపేట ఎస్‌ఐ

రూ.30 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన రాజంపేట ఎస్‌ఐ

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

 

రాజంపేట: కేసులో అనుకూలంగా వ్యవహరిస్తానంటూ ఓ వ్యక్తి నుంచి రూ.30 వేల లంచం తీసుకుంటున్న రాజంపేట పోలీస్‌స్టేషన్ ఎస్‌ఐ దువ్వల ఆంజనేయులు ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. తన నివాసంలోనే లంచం స్వీకరిస్తుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి నగదును స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.రాజంపేట పోలీస్‌స్టేషన్ పరిధిలో నమోదైన ఓ కేసులో ఫిర్యాదుదారుడి కుమారుడికి స్టేషన్ బెయిల్ ఇప్పించడంతో పాటు, తదుపరి దర్యాప్తు, చార్జ్‌షీట్ దాఖలు సమయంలో అనుకూలంగా వ్యవహరించేందుకు ఎస్‌ఐ రూ.30 వేల నగదు డిమాండ్ చేసినట్లు ఏసీబీకి ఫిర్యాదు అందింది.బాధితుడి ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు ముందస్తు ప్రణాళిక రూపొందించారు. గురువారం ఎస్‌ఐ తన నివాసంలో బాధితుడి నుంచి లంచం తీసుకుంటున్న సమయంలో అధికారులు దాడి చేసి పట్టుకున్నట్లు వెల్లడించారు. లంచం సొమ్మును స్వాధీనం చేసుకుని, ఎస్‌ఐను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.అనంతరం నిందితుడైన ఎస్‌ఐను అరెస్టు చేసి హైదరాబాద్ నాంపల్లిలోని ఎస్‌పీఈ, ఏసీబీ కేసుల ప్రత్యేక న్యాయస్థానం ముందు హాజరుపరిచినట్లు ఏసీబీ వర్గాలు వెల్లడించాయి. ఫిర్యాదుదారుడి భద్రత దృష్ట్యా ఆయన వివరాలను గోప్యంగా ఉంచినట్లు అధికారులు తెలిపారు.ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు లంచం డిమాండ్ చేస్తే ప్రజలు భయపడకుండా ఏసీబీని ఆశ్రయించాలని అధికారులు సూచించారు. లంచం డిమాండ్ చేసిన సందర్భాల్లో 1064 టోల్‌ఫ్రీ నంబర్ లేదా 9440446106 వాట్సాప్ నంబర్ ద్వారా ఫిర్యాదు చేయాలని కోరారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *