Tv424x7
Telangana

అయోధ్య రాముడికి దుబ్బాక చేనేత వస్త్రాలు..!!

దుబ్బాక, సెప్టెంబర్‌ 17: అయోధ్య బాలరాముడికి మరోసారి సిద్దిపేట జిల్లా దుబ్బాక చేనేత వస్త్రాలను అలంకరించారు. దుబ్బాక పట్టణంలోని హ్యాండ్లూమ్‌ అండ్‌ హ్యాండీక్రాఫ్ట్‌ ప్రొడ్యూసర్‌ కంపెనీ లిమిటెడ్‌ వారు తయారు చేసిన చేనేత వస్ర్తాల్లో సోమవారం బాల రాముడు మెరిసిపోయారు.చేనేత మగ్గాలపై 80/100 లియా లెనిని ఫ్యాబ్రిక్‌తో గల 16 మీటర్ల తెలుపు రంగు వస్ర్తాన్ని తయారు చేసి అందజేసినట్టు ఆ కంపెనీ వ్యవస్థాపకుడు బోడ శ్రీనివాస్‌ తెలిపారు. అయోధ్య బాలరాముడి విగ్రహానికి దుబ్బాక చేనేత వస్ర్తాలు మరోసారి అలంకరించడంపై స్థానిక నేతన్నలు సంతోషం వ్యక్తంచేశారు.

Related posts

హైదరాబాద్, విజయవాడకు నిలిచిపోయిన రాకపోకలు

TV4-24X7 News

రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచార శాఖల మంత్రి గా సచివాలయంలో బాధ్యతలు స్వీకరించిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి

TV4-24X7 News

తెలంగాణలో 213 మంది ఖైదీల విడుదల..!

TV4-24X7 News

Leave a Comment