Tv424x7
AndhrapradeshPolitical

3రాష్టాల్లో బీజేపీ ఘనవిజయం మైదుకూరులో బిజెపి నాయకుల సంబరాలు

కడప/మైదుకూరు:- మైదుకూరులోని శ్రీకృష్ణదేవరాయలు రాయల కూడలి వద్ద భారతీయ జనతా పార్టీ బిజెపి నాయకులు మైదుకూరు నియోజకవర్గ కన్వీనర్ మాచన్నూరు సుబ్బరాయుడు ఆధ్వర్యంలో రాజస్థాన్ మధ్యప్రదేశ్ చతిస్గడ్ మూడు రాష్ట్రాల్లో బిజెపి అఖండ విజయం సాధించిన సందర్భంగా బాణ సంచార పేల్చి మిఠాయిలు పంచుకొని సంబరాలు చేసుకోవడంజరిగింది. ఈ సందర్భంగా నియోజకవర్గ కన్వీనర్ మాచన్నూరు సుబ్బరాయుడు మాట్లాడుతూమూడు రాష్ట్రాల్లో ఎటువంటి ఉచిత పథకాలు ప్రవేశపెట్టకుండా అఖండ మెజారిటీతో గెలుపొందిన బిజెపి నీ గెలిపించి మోడీ గారి నాయకత్వాన్ని ప్రజలంతా నమ్మరని ప్రజల్లో భారతీయ జనతా పార్టీ బిజెపి నరేంద్ర మోడీ గారి పాలన కోరుకుంటుందని ఇప్పటికైనా ప్రజలు యువతరం తెలుసుకోవాలని కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన అనేక పథకాలు ప్రజల్లోకి వెళుతున్న రాష్ట్రంలో మాత్రం ముఖ్యమంత్రులు కేంద్ర ప్రభుత్వాల విషయాలను ప్రజలకు ఎక్కడ తెలియనివ్వకుండా రాష్ట్రముద్ర వేసుకొని కేంద్రం 70% ప్రజలకు ఖర్చు పెడితే 30% రాష్ట్ర ప్రభుత్వంది ఉంటుందన కేంద్రం ఏమి చేయలేదన్నట్లుగా ప్రజలను మభ్య పెట్టే విధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలన ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అనేక పథకాలు ప్రవేశ పెట్టడం జరిగిందని రైతులకు కిసాన్ పథకాల నుండి సబ్సిడీల వరకు సుకన్య పథకాల నుండి మహిళలకు అండగా గృహ నిర్మాణానికి సంబంధించిన అనేక పథకాల ప్రజలు లబ్ధి పొందుతున్నారని గరీబ్ కళ్యాణ్ యోజన కింద ప్రతి పేదవానికి ఐదు కిలోల బియ్యం ఉచితంగా ఉందని ఆయుష్మాన్ భారత్ ఆరోగ్యం కింద ఐదు లక్షల రూపాయలు కరోనా టైంలో రెండు ఇంజక్షన్లు రైతులకు గిట్టుబాటు ధర మరియు 2000 రూపాయలతో మూడుసార్లు ఇవ్వడం జరిగిందని సిసి రోడ్లు డ్రైనింగ్ వ్యవస్థ కరెంటు వ్యవస్థ మంచినీటి వ్యవస్థ ఆర్మీ నావి వాయు సేన కట్టుదిద్ధమైన రక్షణ వలయాన్ని ప్రధాని ఏర్పాటు చేయడం జరిగిందని స్వదేశంలోనే మందు పాత్రలు తయారు చేసుకోవడం ఇతర దేశాలకు అందించడం అది బిజెపి తోనే సాధ్యమైందని ప్రజలంతా బిజెపి పై నమ్మకంతో స్వాగతం పలుకుతున్నారని ఇప్పటికైనా ప్రజలు గమనించి భారతీయ జనతా పార్టీని అఖండ మెజారిటీతో గెలిపించాలని తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో మైదుకూరు బిజెపి నాయకులు మాజీ జిల్లా అధ్యక్షుడు ఎల్లారెడ్డి, బిపి ప్రతాప్ రెడ్డి ,చంద్రశేఖర్ ,గుర్రప్ప, రామకృష్ణ, రఘునాథ్ రెడ్డి మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

Related posts

కుప్పంలో చంద్రబాబు రెండో రోజు పర్యటన.. షెడ్యూల్ ఇదే..

TV4-24X7 News

జగనన్నా.. మెగా డీఎస్సీ ఎక్కడ…?

TV4-24X7 News

స్వచ్ఛ ఆంధ్ర సింగల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులకు స్వస్తి పలుకుదాం

TV4-24X7 News

Leave a Comment