ప్రముఖ డిజిటల్ చెల్లింపుల సంస్థ ఫోన్పే సరికొత్త ఫీచర్ను అందుబాటు లోకి తెచ్చింది. క్రెడిట్, డెబిట్ కార్డుల కోసం డివైజ్ టోకనైజేషన్ సొల్యూషన్స్ను ప్రారంభించింది. దీని ద్వారా బిల్లు చెల్లింపులు, రీఛార్జ్లు, ప్రయాణ టికెట్ల బుకింగ్, బీమా కొనుగోలు, పిన్ కోడ్ ఆధారిత చెల్లింపులు సులభంగా చేసుకోవచ్చు. ఇకపై ప్రతి లావాదేవీకి తమ కార్డు వివరాలను మర్చంట్ వేదికలపై భద్రపరచాల్సినఅవసరం ఉండదని తెలిపింది.

previous post
next post