విశాఖ దక్షిణ నియోజకవర్గం 35 వ వార్డు పరిధిలో బౌడర రోడ్డు పూర్ణ మార్కెట్ సమీపంలో సుమారు 500 మందికి మహా అన్నదాన కార్యక్రమం అన్నదాత మూర్తి ధన సహాయంతో ఏర్పాటు చేయడం జరిగినది కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా 35 వ వార్డు కార్పొరేటర్ జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ మెంబర్ విచ్చేసి వారి చేతుల మీదుగా మహా అన్నదాన కార్యక్రమం ప్రారంభం చేయడం జరిగినది. అలాగే వారు మాట్లాడుతూ ఈ కాలంలో ప్రస్తుత కాలంలో మన కోసం కాకుండా పరుల కోసం మహా అన్నదానం కార్యక్రమం ఏర్పాటు చేసి పదిమందికి కడుపు నిండాలని ఒక మంచి ఆలోచన తో మంచి కార్యక్రమం ఏర్పాటు చేసిన మూర్తి ని అభినందిస్తూ రాబోయే రోజుల్లో ఇటువంటి మహా అన్నదాన కార్యక్రమాలు ఆయన ఎన్నో చేయాలని అందుకు నా వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ కూడా ఉంటాయని అన్ని దానాల కన్నా అన్నదానమే చాలా గొప్ప అని చెప్పి మాట్లాడడం జరిగినది కార్యక్రమంలో వార్డ్ టిడిపి నాయకులు పార్టీ శ్రేణులు కార్యకర్తలు పాల్గొనడం జరిగినది.
