Tv424x7
Andhrapradesh

స్వయంకృషితో పైకి వచ్చిన నాయకుడు డాక్టర్ బి.అర్అంబేద్కర్ ఉరికిటి గణేష్

విశాఖపట్నం భారతరత్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.అర్అంబేద్కర్  134 వ జయంతిని పురస్కరించుకొని విశాఖ సౌత్ ఇంచార్జ్ సీతంరాజు సుధాకర్  ఆదేశాల మేరకు 29వ వార్డు పరిధిలో వెంకటపతిరాజునగర్ లో ఉన్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి 29వ వార్డు తెలుగుదేశం అధ్యక్షులు ఉరికిటి గణేష్  పూలమాల వేసి నివాళులు అర్పించారు, ఈ  సందర్భంగా ఉరికిటి గణేష్ మాట్లాడుతూ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేద కుటుంబంలో పుట్టినా, సాంఘిక పరమైన ఆర్థికపరమైన అవమానాలతో నిరంతరం పోరాడుతూ స్వయంకృషితో పైకి వచ్చారు. ఎన్ని కష్టాలు ఎదురైనప్పటికీ విదేశాలలో విద్యాభ్యాసం పూర్తిచేసి జాతి గర్వించే స్థాయికి ఎదిగారని కొనియాడారు.అనంతరం స్థానిక పెద్దలను సన్మానించి స్థానిక నిరుపేద మహిళలకు తెలుగుదేశం కమిటీ సభ్యులచే చీరలు అందజేసినారు, అలాగే పెంట వీధి బి ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు, ఈ కార్యక్రమంలో వార్డు జనరల్ సెక్రటరీ రాయన బంగారు రాజు, బండి అప్పలరాజు, పిల్లల గోపమ్మ, సీనియర్ కార్యకర్తలు పాల్గొన్నారు.

Related posts

ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించాలి- పక్కా గృహాలను వెంటనే పూర్తి చేయాలి- మండల ప్రత్యేక అధికారి మైకేల్ రాజీవ్

TV4-24X7 News

35వ వార్డు ప్రాంతంలో పర్యటన

TV4-24X7 News

దేశవ్యాప్తంగా ఎన్ఐఏ సోదాలు.. సౌత్ ఇండియాలో 19 చోట్ల తనిఖీలు

TV4-24X7 News

Leave a Comment