సూళ్లూరుపేట:రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఆంధ్రప్రదేశ్ రీ సర్వే ప్రాజెక్టులో భాగంగా వర్క్ షాప్ కం ఇంటరాక్షన్ మీటింగ్ తిరుపతి జిల్లా సూళ్లూరుపేట డివిజనులోని తహశీల్దార్లు, రీ సర్వే ఉప తహశీల్దార్లు,డిప్యూటీ ఇన్స్ పెక్టర్ ఆఫ్ సర్వేయర్, సచివాలయ సర్వేయర్లు, మండల రెవెన్యూ ఇన్స్ పెక్టర్లు, గ్రామ రెవెన్యూ అధికారులకు అవగాహన మరియు ట్రైనింగ్ కార్యక్రమం సత్య సాయి కళ్యాణ మండపంలో జరిగింది. ఆర్డీవో మాట్లాడుతూ 9 మండలాలలో 60 రోజులలో సర్వే పూర్తి చేయాలని, సర్వే చేసే ముందు రైతులకు 15 రోజులకు ముందుగానే తెలియపరచాలని, రైతుల సమక్షంలోనే సర్వే చేయాలని, ఎండలు తీవ్రత ఎక్కువగా ఉన్నందున ఉదయం 7 గంటల నుండి 11 గంటల వరకు మధ్యాహ్నం మూడు గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు సర్వే చేసుకోవాలని తెలియజేశారు. ప్రతి ఒక్క రెవెన్యూ అధికారి సర్వే విషయంలో జాప్యం చేయకూడదని, తెలియజేశారు.

previous post