ఆపరేషన్ సిందూర్లో భాగంగా భారత సైన్యం పాకిస్థాన్లోని ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై పహల్గాం ఉగ్రదాడి మృతుడు, నేవీ అధికారి లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ భార్య హిమాన్షి నర్వాల్ స్పందించారు. ఉగ్రవాదుల ఏరివేత చర్యను ఇంతటితో ఆపొద్దని విజ్ఞప్తి చేశారు. ఆపరేషన్ సిందూర్ ఉగ్రవాదులను తుదముట్టించడంలో ఆరంభం మాత్రమే కావాలని అన్నారు. ఈ ఆపరేషన్ నిర్వహించిన భారత సైనికులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.

previous post