వామ్మో…ఇంకా ఉన్నారా ఇలాంటి కేటుగాళ్ళు….టెక్నాలజీ లేదు….అంతా బిత్తిరీ….ఇది దగ్గరుంటే కోట్లు సంపాదించవచ్చు’ – కేటుగాళ్ల ఘరానా మోసపోలీసులు తలచుకుంటే కేటు గాళ్లకు దబిడి దిబిడే….రైస్ పుల్లింగ్ నాణెం పేరుతో మోసగిస్తున్న ముఠా – విజయనగరానికి చెందిన ముగ్గురి అరెస్టు రైస్ పుల్లింగ్ నాణెం పేరుతో మోసగిస్తున్న ముఠాలోని ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం గ్రామీణ సీఐ రేవతమ్మ నిందితుల వివరాలను వెల్లడించారు. ఈ క్రమంలో సీఐ మాట్లాడుతూ గొలుగొండ మండలం నెల్లిమెట్ట సమీపంలోని రాతిపణుకుల వద్ద కారులో ఐదుగురు వ్యక్తులు అనుమానాస్పదంగా ఉన్నట్లు అందిన సమాచారంతో గొలుగొండ, నర్సీపట్నం గ్రామీణ ఎస్సైలు రామారావు, రాజారావు సిబ్బందితో దాడి చేశారని అన్నారు.రూ.10 లక్షల నకిలీ నోట్లు స్వాధీనం: పోలీసులు దాడి చేస్తున్న సమయంలో గమనించిన నిందితులు పారిపోవడానికి ప్రయత్నించారని తెలిపారు. అందులో ఇద్దరు పారిపోగా ముగ్గురు వ్యక్తులు పట్టుబడ్డారని అలానే వారి కారులో రూ.2.6 లక్షల అసలు నోట్లు, రూ.10 లక్షలు నకిలీ నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారని వెల్లడించారు. వారి దగ్గరి నుంచి ఒక కారు, 1 సెల్ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకుని సీజ్ చేశారని సీఐ అన్నారు.పట్టుబడిన నిమ్మల మనోహర్, తమ్మినేని సుమంత్కుమార్, నిమ్మల మన్మధ విజయనగరంకు చెందిన వారని చెప్పారు. పరారైన ఇద్దరిలో ఒకరిపై గతంలో 4 కేసులు ఉన్నాయని పట్టుబడిన వారిలో ఒకరు కిడ్నాప్ కేసులో నిందితుడని సీఐ పేర్కొన్నారు. నకిలీ నోట్లను చిల్డ్రన్స్ క్లబ్ పేరుతో ఆన్లైన్లో నిందితులు కొనుగోలు చేశారని వీటిని నిరక్షరాస్యులు గమనించలేని విధంగా ఉన్నాయని చెప్పారు.ఈ రైస్ పుల్లింగ్ నాణెంకు మహిమలు: ‘ఈ రైస్ పుల్లింగ్ నాణెంకు మహిమలున్నాయి దీన్ని దగ్గర ఉంచుకుంటే రూ. కోట్లు గడించవచ్చు. ఈ నాణం ఎలా పనిచేస్తుందో చూడండి’ అంటూ వీడియోలు చూపి నమ్మిస్తారని ఇంక నాణెం ద్వారా తాము సంపాదించిన డబ్బు చూడండి అంటూ నోట్ల కట్టలు చూపించి మాయ చేస్తారని అన్నారు. ఆకర్షితులైన వారందరినీ సమావేశపరిచి వేలం నిర్వహించి ఎక్కువ మొత్తానికి పాడిన వ్యక్తి నుంచి డబ్బులు వసూలు చేసి బురిడీ కొట్టించి పరారవుతుంటారని సీఐ రేవతమ్మ తెలిపారు. ఇలా ఎవరైనా మోసగించే ప్రయత్నం చేస్తే 112, 100, 1903 నంబర్లకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చని సీఐ అన్నారు.

previous post