Tv424x7
National

రెండు తీర్మానాలకు ఏకగ్రీవ ఆమోదం!

హైదరాబాద్: ఎన్డీయే పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రుల సమావే శంలో రెండు తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించారు. ఆపరేషన్ సిందూర్ కు సంబంధించిన వివరాలను సీఎంలు, డిప్యూటీ సీఎంలకు కేంద్ర మంత్రులు వివరించారు. ఆపరేషన్ సిందూర్ విజయంపై ప్రధాని మోదీ, సైన్యాన్ని అభినందిస్తూ ఒక తీర్మానం చేయగా.. దేశవ్యాప్తంగా కుల జన గణన చేపట్టడం కేంద్ర ప్రభుత్వాన్ని అభినందిస్తూ మరో తీర్మానం చేయగా..రెండు తీర్మానాలని ఎన్డీయే పక్ష నేతలు ఏకగ్రీవంగా ఆమోదించారు. ఎన్డీయే కూటమి మూడో టర్మ్ లో ఏడాది పాలనపై చర్చించా రు. ఏపీ సీఎం చంద్రబాబు మినహా ఎన్డీయే పాలిత సీఎంలు, డిప్యూటీ సీఎంలు ఈ సమావేశానికి హాజర య్యారు. ముందుగా నిర్ణయించి న కార్యక్రమం కారణంగా చంద్రబాబు, హాజరు అవ్వలేకపోయారు. దీంతో ఏపీ తరపున డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఈ మీటింగ్ కు హాజరయ్యారు.ఎన్డీయే పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ ఆదివారం ఢిల్లీలో సమావేశమయ్యారు. సాయుధ దళాల పరాక్రమాన్ని, ఆపరేషన్ సిందూర్ ను, ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వా న్ని ప్రశంసిస్తూ ఈ సమావేశంలో తీర్మానాన్ని ఆమోదించారు.శివసేన నాయకుడు, మహా రాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌ నాథ్ షిండే ప్రతిపాదించిన తీర్మానం ఆపరేషన్ సిందూర్ భారతీయుల ఆత్మవిశ్వాసాన్ని పెంచిందని బీజేపీ వర్గాలు తెలిపాయి. కుల గణన, మోదీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా జరుపుకునే వేడుకలు, కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సుపరిపాలన అంశాలు ఈ సమావేశం ఎజెండాలో ఉన్నాయని బీజేపీ తెలిపింది. ఈ సమావేశంలో ముఖ్య మంత్రులు తమ తమ రాష్ట్రాల్లో అమలవుతున్న కీలక పథకాలపై ప్రజెంటే షన్లు ఇచ్చారు. ఏప్రిల్ 22న జరిగిన పహల్గాం ఉగ్రవాద దాడి మృతులకు ఎన్డీయే సమావేశంలో నివాళి అ ర్పించారు.తమ రాష్ట్రాల్లో ఎన్డీయే కూటమి ప్రభుత్వాలు చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ఆయా రాష్ట్రాల సీఎంలు, డిప్యూటీ సీఎంలు వివరించారు. ఆపరేషన్‌ సిందూర్‌ సమ యంలో సాయుధ దళాలకు అధికారాలను ఇచ్చి ముందుకు నడిపించారని ప్రధాని మోదీపై ప్రశంసల వర్షం కురిపించారు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ శిండే. ఆయన ఎల్లప్పుడూ సాయుధ దళాలకు మద్దతిచ్చారని చెప్పారు. ఆపరేషన్ సిందూర్‌.. ఉగ్రవాదులకు, వారిని పోషిస్తున్న వారికి తగిన బుద్ధి చెప్పిందన్నారు.

Related posts

దేశవ్యాప్తంగా పలు కాలేజీలు, పాఠశాలలు నేడు సెలవు ఇచ్చాయి.

TV4-24X7 News

నేడు కల్కిధామ్‌కు ‍ప్రధాని మోదీ శంకుస్థాపన

TV4-24X7 News

ఈ రోజే అక్షయ తృతీయ.. శుభ సమయం ఎప్పుడంటే..?

TV4-24X7 News

Leave a Comment