ప్రొద్దుటూరు, జూన్.17: తెలంగాణ రాష్ట్రం ఫోన్ టాపింగ్ కేసు దర్యాప్తులో మరో కొత్త మలుపు తిరిగింది. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్, పిసిసి రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రెడ్డి ఫోన్ నెంబర్ టాపింగ్ అయినట్లు దర్యాప్తు బృందం గుర్తించినట్లు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో మూడేళ్ళ క్రితం 2021 లో ఫోన్ నెంబర్ టాపింగ్ అయినట్లు నిర్ధారించారు. ఈ నేపథ్యంలో కడప జిల్లా, పొద్దుటూరు కాంగ్రెస్ ఇంచార్జ్ ఇర్ఫాన్ భాష మాట్లాడుతూ.. పిసిసి రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి ఫోన్ నెంబర్ టాపింగ్ చేయడం దుర్మార్గపు చర్య అని ఆయన ఖండించారు. ఫోన్ నెంబర్ టాపింగ్ చేసిన వారిని చట్టపరంగా కఠినంగా శిక్షించాలని కోరారు.

previous post
next post