Tv424x7
National

ఆ 36 సెకన్లలో ఏం జరిగింది ? పైలట్లు ఏం మాట్లాడారు ? విమాన ప్రమాద దర్యాప్తు సంస్థల ఎదుట కీలక ప్రశ్నలు!

అహ్మదాబాద్‌‌లో కూలిన విమానంలో ఏం జరిగింది?-టేకాఫ్ అయిన 36 సెకన్లకే థ్రస్టింగ్‌ను కోల్పోయిన విమానం-పైలట్లు జరిపిన సంభాషణపై కాక్‌పిట్ వాయిస్ రికార్డర్‌లో నిక్షిప్తం- బ్లాక్ బాక్స్​లోనే దర్యాప్తు సంస్థలకు కీలక సాక్ష్యాలు దొరికే ఛాన్స్!గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జూన్ 12న (గురువారం) జరిగిన ఘోర విమాన ప్రమాదంపై ముమ్మరంగా దర్యాప్తు కొనసాగుతోంది. ఈ విచారణలో విమాన శకలాల నుంచి సేకరించిన కాక్‌పిట్ వాయిస్ రికార్డర్ (సీవీఆర్​), ఫ్లైట్ డాటా రికార్డర్ (ఎఫ్​డీఆర్​) కీలకంగా మారనున్నాయి. ముదురు నారింజ రంగు పెయింట్‌తో ఉండే ఈ రెండు పరికరాలను కలిపి ‘’బ్లాక్ బాక్స్’’ అంటారు. విమానం టేకాఫ్ అయినప్పటి నుంచి కూలడానికి కొన్ని సెకన్ల ముందు వరకు వీటిలో రికార్డయిన సంభాషణల సమాచారాన్ని హైలెవల్ మల్టీ డిసిప్లినరీ కమిటీ, ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (ఏఏఐబీ) నిశితంగా పరిశీలిస్తున్నాయి. ఈనేపథ్యంలో కొన్ని ప్రశ్నలకు సమాధానాల కోసం దర్యాప్తు అధికారులు కాక్‌పిట్ వాయిస్ రికార్డర్ (సీవీఆర్)పై ఆధారపడుతున్నారు. అవేంటో ఈ కథనంలో చూద్దాం.ఈ సమాచారాన్ని సక్రమంగా కూరిస్తేనే క్లారిటీప్రమాదానికి గురైన ఎయిర్ ఇండియా ‘ఏఐ 171’ విమానంలోని పైలట్లు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) విభాగానికి ఎప్పుడు కాల్ చేశారు? ఏం చెప్పారు? పైలట్లు మాట్లాడాక ఎలాంటి సౌండ్స్ వచ్చాయి? అనే సమాచారం మొత్తం సీవీఆర్, ఎఫ్​డీఆర్​లలో నిక్షిప్తమై ఉంటుంది. కూలిపోవడానికి ముందు విమానం గరిష్ఠంగా ఎంత ఎత్తుకు ఎగిరింది? ఎంత ఎత్తులో ఉన్నప్పుడు అదుపు తప్పింది? రన్‌వే నుంచి ఎంతదూరం వెళ్లాక విమానంలో సమస్యలు తలెత్తాయి? ఆ టైంలో గాలి వేగం ఎంత? అనే సమాచారాన్ని సైతం ఆ రెండు పరికరాలు అందిస్తాయి. ఈ మొత్తం సమాచారాన్ని సేకరించి, సక్రమంగా కూరిస్తేనే ప్రమాదం జరిగిన తీరుపై పూర్తి క్లారిటీ వస్తుంది.ఇంజిన్లు పనిచేయకే విమానం థ్రస్టింగ్‌ను కోల్పోయిందా ?ఇంజిన్లు పనిచేస్తుంటేనే విమానం ముందు వైపుగా కదులుతుంటుంది. విమానం ముందుకు కదిలే స్థితినే ‘థ్రస్టింగ్‌’ అంటారు. ఏఐ171 విమానం జూన్ 12న టేకాఫ్ అయిన 36 సెకన్లకే థ్రస్టింగ్‌ను కోల్పోయిందని గుర్తించారు. బహుశా ఇంజిన్లలో తలెత్తిన లోపం వల్లే ఇలా జరిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు. విమానంలోని 241 మంది, అహ్మదాబాద్‌లోని బీజే మెడికల్ కాలేజీలో ఉన్న 33 మందిని బలిగొన్న ఈ దుర్ఘటనకు దారితీసిన కారణాలేంటో తెలియాల్సిన అవసరం ఉంది. తద్వారా కనీసం భవిష్యత్తులోనైనా ఇలాంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్త చర్యలను చేపట్టే అవకాశం కలుగుతుంది.కెప్టెన్ సుమీత్ సభర్వాల్ ఏం చెప్పారు ?విమానం కూలడానికి కొన్ని సెకన్ల ముందే పైలట్లు అత్యవసర కాల్ చేశారని విమానయాన శాఖ గతవారం వెల్లడించింది. ‘‘మేడే, మేడే’’ అని అహ్మదాబాద్ ఏటీసీకి కెప్టెన్ సుమీత్ సభర్వాల్ చెప్పారని తెలిపింది. విమానం పవర్‌, థ్రస్ట్‌లను కోల్పోయిందని ఆయన చెప్పారంటూ పలు కథనాలు వచ్చాయి. ఒకవేళ ఈ మాటలను పైలట్ సుమీత్ చెప్పి ఉంటే అవన్నీ కాక్‌పిట్ వాయిస్ రికార్డర్ (సీవీఆర్)లో రికార్డ్ అవుతాయి. ఈ కేసు దర్యాప్తులో ఆ మాటలే కీలక సాక్ష్యంగా మారుతాయి. ఇంజిన్లు ఫెయిలైన సందర్భాల్లో విమానం పవర్, థ్రస్ట్‌లను కోల్పోతుంటుంది. ఇదే అంశాన్ని దర్యాప్తు అధికారులు పరిగణనలోకి తీసుకునే సూచనలు ఉంటాయి.ఆ 36 సెకన్ల విపత్కర సమయంలో ఏం జరిగింది ?ఏఐ 171 విమానం జూన్ 12న మధ్యాహ్నం 1.39 గంటలకు అహ్మదాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి టేకాఫ్ అయింది. ఈ వివరాలను కేంద్ర ప్రభుత్వం ధ్రువీకరించింది. టేకాఫ్ అయిన 36 సెకన్ల తర్వాత విమానం కూలిందని అంటున్నారు. కాక్‌పిట్ వాయిస్ రికార్డర్ (సీవీఆర్)లో ప్రతీ సంభాషణ, ప్రతీ సందేశం, ప్రతీ శబ్దం రికార్డయి ఉంటుంది. విమానం పైలట్ సుమీత్ సభర్వాల్ కచ్చితంగా ఎన్ని మిల్లీ సెకన్లకు మేడే మెసేజ్‌ను ఏటీసీకి పంపారో సీవీఆర్​లో నిక్షిప్తమై ఉంటుంది. 36 సెకన్ల అతిస్వల్ప వ్యవధిలో విమానాన్ని కాపాడేందుకు పైలట్ సుమీత్ సభర్వాల్, కో పైలట్ క్లైవ్ కుందెర్ ఏయే ప్రయత్నాలు చేశారనేది కూడా సీవీఆర్​లో దాగిన రికార్డింగ్ ద్వారా తెలిసిపోతుంది. టేకాఫ్ కావడానికి ముందే విమానంలో ఆయా సాంకేతిక సమస్యలు ఉన్నాయా? పైలట్లు వాటిని గుర్తించలేకపోయారా? విమానం టేకాఫ్ అయ్యాకే సాంకేతిక సమస్యలు తలెత్తాయా? అనే ప్రశ్నలకు సమాధానాలను తెలుసుకునేందుకు సీవీఆర్​లోని సమాచారంపై దర్యాప్తు అధికారులు ఆధారపడనున్నారు.పైలట్లు, ఏటీసీ ఎవరెవరు ఏం మాట్లాడారు?విమానం అదుపు తప్పినప్పటి నుంచి కూలిపోయే దాకా ఇద్దరు పైలట్లు సుమీత్ సభర్వాల్, క్లైవ్ కుందెర్ ఏమేం మాట్లాడుకున్నారు ? ఏటీసీకి ఏయే మెసేజ్‌లను పంపారు? పైలట్లకు ఏటీసీ సిబ్బంది ఎలాంటి సమాధానాలను పంపారు? అనే వివరాలన్నీ కాక్‌పిట్ వాయిస్ రికార్డర్​లో నిక్షిప్తమై ఉన్నాయి. కాక్ పిట్ సౌండ్, ఇంజిన్ సౌండ్, అలారం శబ్దాలు కూడా సీవీఆర్​లో రికార్డ్ అవుతాయి. ఇందులో నుంచి కీలకమైన సాక్ష్యాలను దర్యాప్తు అధికారులు సేకరించనున్నారు. అయితే విమానం కూలే చివరి సెకన్లలో మోగిన అలారం శబ్దాల వల్ల కొన్ని సంభాషణల రికార్డింగ్ స్పష్టంగా జరిగి ఉండకపోవచ్చని అంటున్నారు.మొత్తం మీద ఈ ప్రశ్నలకు సమాధానాలను తెలుసుకోవడం ద్వారా విమాన ప్రమాదం జరిగిన తీరు, అందుకు దారితీసిన కారణాలపై స్పష్టతకు వచ్చేందుకు దర్యాప్తు అధికారులు ప్రయత్నించనున్నారు. తద్వారా ఇకపై ఇలాంటి ఘోర ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపట్టేందుకు వీలు కలుగుతుంది.

Related posts

అయోధ్యలో రామ మందిర ప్రాణప్రతిష్ఠ చేసిన పూజారి ఆచార్య లక్ష్మీకాంత్ దీక్షిత్ కన్నుమూత

TV4-24X7 News

హెలికాప్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు దుర్మరణం.. ప్రధాని మోడీ సంతాపం

TV4-24X7 News

వరుస రైలు ప్రమాదాలు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం

TV4-24X7 News

Leave a Comment