Tv424x7
Andhrapradesh

అమరజీవికి అసలైన నివాళి….

ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు అఖండ సంకల్పంతో 58 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేసి, తన ప్రాణాల్ని అర్పించి, చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారు త్యాగానికి గుర్తుగా… ఆ మహానీయుడి స్మృతిలో 58 అడుగుల కాంస్య విగ్రహాన్ని అమరావతిలో ఏర్పాటు చేయనున్నారు.

ఈ విగ్రహ నిర్మాణానికి సంబంధించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, శ్రీరాములు గారి 125వ జయంతి సందర్భంగా ఈ హామీని ప్రకటించారు. అంతకు మునుపు, యువగళం పాదయాత్ర సందర్భంగా మంత్రి నారా లోకేష్ గారు కూడా ఇదే హామీని ప్రజలకు ఇచ్చారు. ఈ రోజు ఆ హామీ కార్యరూపం దాల్చింది.

నారా లోకేష్ గారు అమరావతిలో, ఈ మహాత్ముని విగ్రహ స్థాపనకు శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన 6.8 ఎకరాల విస్తీర్ణంలో, ఈ అద్భుతమైన విగ్రహం ఏర్పడనుంది.ఈ విగ్రహం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచే స్ఫూర్తి సౌధంగా, పొట్టి శ్రీరాములు గారి త్యాగాన్ని తరతరాలకు గుర్తు చేసే ప్రేరణాత్మక చిహ్నంగా నిలవనుంది.

Related posts

ప్రతి ఆహార వ్యాపారి పోస్టాక్ శిక్షణా సర్టిఫికేషన్ పొంది ఉండాలి : ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ హరిత రాయల్

TV4-24X7 News

వేదాంత ఆధ్వర్యంలో39వ వార్డులో ఘనంగా దీపావళి సంబరాలు

TV4-24X7 News

మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లిని పోలీస్ కస్టడీకి అప్పగించిన కోర్టు

TV4-24X7 News

Leave a Comment