తెలంగాణ /సూర్యాపేట :- నూరేళ్లు కలిసి జీవిస్తామని ప్రమాణం చేసుకుని, ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చిన ఆ దంపతులు ఆత్మహత్యకు పాల్పడిన ఉదంతం ముదినేపల్లి మండలం పెదగొన్నూరు శివారు విశ్వనాద్రిపాలెంలో మంగళవారం సాయంత్రం జరిగింది.అప్పులు యమపాశంగా మారి వారి జీవితాలను అర్ధంతరంగా ముగిసేలా చేశాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..గ్రామానికి చెందిన పరసా మాతనాగబాబు(30)కు తెలంగాణ రాష్ట్రం సూర్యాపేటకు చెందిన అనూష(28)కు 2015లో వివాహం జరిగింది. వీరికి ఆరేళ్ల కుమారుడు, నాలుగేళ్ల కుమార్తె ఉన్నారు. మంగళవారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంట్లో పైకప్పునకు రెండు చీరలతో ఉరేసుకుని మృతిచెందారు. పక్క ఇంట్లో నివాసముంటున్న నాగబాబు తల్లి వెంకటరమణ కూలిపనికి వెళ్లి వచ్చి మంగళవారం సాయంత్రం మినప్పప్పు కోసం వెళ్లి చూడగా భార్యాభర్తలు వేలాడుతూ కనిపించారు. స్థానికులు ఆసుపత్రికి తరలించడానికి యత్నించగా అప్పటికే మృతి చెందారు. పాఠశాలనుంచి వచ్చేసరికి విగతజీవులుగా పడి ఉన్న తల్లిదండ్రులను చూసిన ఆ చిన్నారులు కంటనీరు పెట్టడం చూపరులను కలచివేసింది. కైకలూరు రూరల్ సీˆఐ కృష్ణకుమార్, ఎస్ఐ వెంకట్కుమార్ సంఘటనా స్థలానికి వచ్చి వివరాలు సేకరించారు.*రొయ్యలసాగుతో నష్టాలు*నాగబాబు గ్రామంలోనే రొయ్యలు సాగు చేశారు. ఈ ఏడాది జూన్తో చెరువు లీజు పూర్తవగా సుమారు రూ.10 లక్షల మేర అప్పులపాలయ్యారు. దీంతో భార్య నగలు సైతం తాకట్టు పెట్టారు. తండ్రి కొంత అప్పు తీర్చినా ఇంకా ఉంది. రొయ్యల సాగుతో నష్టపోయిన నాగబాబు, దానిని విరమించుకొని సింగరాయపాలెంలోని ప్రైవేటు పరిశ్రమలో ఎలక్ట్రికల్ విభాగంలో పనిచేస్తున్నారు. మరో పక్క మూడు నెలల క్రితం భార్యతో ఇంటి వద్దే సోడా బండి పెట్టించారు.*మా మీద మాకు అసహ్యంh పుట్టి..*’అమ్మా, నాన్నా క్షమించండి, మాకు బతకడం ఇష్టం లేదు. అప్పు తీర్చాక చనిపోదాం అనుకున్నాం. మా మీద మాకు అసహ్యం పుట్టి చనిపోతున్నాం. పిల్లలు జాగ్రత్త. మా ఇద్దరి కిడ్నీలు ఎవరికైనా పనికొస్తే ఇవ్వండి.హెల్ప్ అవుతుంది’ అంటూ వారు రాసిన ఉత్తరం గదిలో దొరికింది. మా వల్ల ఎవరూ గొడవ పడకండి, మా అంతట మేమే చనిపోతున్నాం. ఎవరి మీదా కోపంతో కాదు.. అని అందులో వివరించారు. బంధువులకు ఇవ్వాల్సిన రూ.5 వేల బాకీ, బీరువాలో ఉన్న రూ.50 వేల సొమ్ము, మూడు నెలల్లో పూర్తవుతున్న బండి ఈఎంఐ, బ్యాంకు ఖాతాలో ఉన్న సొమ్ము తదితరాల గురించి ఆ లేఖలో పేర్కొన్నారు.

previous post