ఏపీలో రాజ్యసభ ఎన్నికలు ఆసక్తి కరంగా మారుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల ముందు ఈ ఎన్నికలు వైసీపీ, టీడీపీ ప్రతిష్ఠాత్మంగా భావించాయి. మూడు స్థానాలకు ఎన్నికలకు నామినేషన్లు మొదలయ్యాయి. ఏపీ శాసనభలో ఉన్న పార్టీల బలాల ఆధారంగా వైసీపీ మూడు స్థానాలకు అభ్యర్దులను ప్రకటించింది. సీఎం జగన్ వారికి బీఫాం ఇచ్చారు. టీడీపీ పోటీ చేయాలని భావించినా..ఇంకా నిర్ణయం తీసుకోలేదు. వైసీపీ మూడు స్థానాలు దక్కించుకుంటే 41 సంవత్సరాల టీడీపీ చరిత్రలో తొలిసారి రాజ్యసభలో ప్రాతినిధ్యం కోల్పోనుంది.
