🚨 ప్రేమించాడు.. నమ్మించాడు.. పెళ్లి చేసుకున్నాడు.. చివరికి డబ్బు కోసం వేధించాడా?
💔 పదేళ్ల ప్రేమ వివాహం విషాదాంతం.. వివాహిత అనుమానాస్పద మృతి
విజయనగరం జిల్లా: బొండపల్లి మండలం కనిమెరక గ్రామంలో వివాహిత అనుమానాస్పద మృతి కలకలం రేపింది. గ్రామానికి చెందిన బుంగ సంధ్య, అదే గ్రామానికి చెందిన రామ ముత్యాలరావు పదేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.
వివాహమైన తొలినాళ్లలో దంపతుల సంసారం సాఫీగా సాగినప్పటికీ, కాలక్రమంలో ఆర్థిక విషయాలపై ఇద్దరి మధ్య విభేదాలు ఏర్పడినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. డబ్బుల విషయంలో సంధ్యను భర్త వేధించేవాడని, పలుమార్లు భౌతికంగా దాడి చేసినట్లు ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
కూతురి కాపురం నిలబడాలనే ఉద్దేశంతో సంధ్య తల్లి పలుమార్లు ఆర్థికంగా సహాయం చేసినప్పటికీ పరిస్థితిలో మార్పు రాలేదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
ఈ క్రమంలో మంగళవారం తెల్లవారుజామున సంధ్య ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకుని, మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ బొండపల్లి పోలీసులను ఆశ్రయించారు.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, క్లూస్ టీమ్ ఆధారాలు సేకరించారు. మృతికి అసలు కారణం ఏమిటి? సంధ్య మృతి సహజమా.. లేక ఏదైనా కుట్ర జరిగిందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
👉 పోలీసుల దర్యాప్తులో వెలుగులోకి వచ్చే వాస్తవాలే కేసులో కీలకం కానున్నాయి.
Save or share this story as a newspaper-style Epaper Clip: