తిరుమలలో ఏప్రిల్ 2న వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు తిరుమలలో ఏప్రిల్ 2న శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేసినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. భక్తులు ఈ విషయాన్ని గమనించి, సహకరించగలరని కోరారు. అయితే ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు వచ్చే మంగళవారం నాడు.. కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ.

previous post