Tv424x7
Andhrapradesh

తాగుబోతుల మధ్య ఘర్షణ ఒకరికి గాయాలు

కడప /పులివెందుల: పులివెందుల పట్టణంలోని పార్నపల్లి రోడ్డు వద్దగల వైన్ షాపు దగ్గర ఆదివారం రాత్రి 7:30 గంటల సమయంలో మద్యం సేవించిన ఇరువురి మధ్య ఘర్షణ రవి అనే వ్యక్తికి తీవ్ర గాయాలు. మద్యం మత్తులో బబ్లు తనకు ఇవ్వవలసిన ఆరువేల రూపాయలు ఎప్పుడు ఇస్తావని రవి ని ప్రశ్నించగా నా దగ్గర ఇప్పుడు లేదు అని చెప్పడంతో మాట మాట పెరిగి కోపద్రికుడైన బబ్లు అక్కడే ఉన్న బీరు బాటిల్తో రవి తలపై కొట్టడంతో తీవ్ర గాయాలు అయ్యాయి. రక్తస్రావంతో పడి ఉన్న రవిని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించి. అనంతరం మెరుగైన చికిత్స కొరకు ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఎస్సై అరుణ్ రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Related posts

నాటు సార తయారీ స్థావరాలపై నర్సీపట్నం పోలీసులు దాడులు

TV4-24X7 News

బాలిక ఆచూకీ గుర్తించి ఆమె తల్లికి అప్పగించిన వన్ టౌన్ పోలీసులు

TV4-24X7 News

స్వర్ణాంధ్ర @ 2047 విజన్ లక్ష్యాలతో 20 సూత్రాల కార్యక్రమం అమలు

TV4-24X7 News

Leave a Comment