విశాఖపట్నం కుటుంబ మనస్పర్థలు కారణముగా ఇంటి నుండి అలిగి వెళ్లిపోయిన మైనర్ బాలిక ఆచూకీ గుర్తించి ఆమె తల్లికి అప్పగించిన నగర వన్ టౌన్ పోలీసులు. కుటుంబ సభ్యుల పై అలిగి వెళ్లిపోయిన బాలిక కోసం ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్ నందు మిస్సింగ్ కేసును నమోదు చేసి, తక్షణం విచారణ చేపట్టి,సోమవారం హొసదరు మైనర్ బాలికను విజయనగరం నందు గుర్తించి, కౌన్సిలింగ్ ఇచ్చి,ఆమె తల్లికి సోమవారం అప్పగించడం జరిగినది. తప్పిపోయిన కుమార్తెను తిరిగి భద్రముగా అప్పగించిన వన్ టౌన్ సి.ఐ జి.డి. బాబు కి, స్టేషన్ సిబ్బంది కి, విశాఖ నగర పోలీసులకు బాలిక తల్లి తన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. నగర పోలీస్ కమిషనర్ నగర పోలీసు కమీషనర్ డా. శంఖబ్రత బాగ్చి,ఐ.పి.ఎస్., బాలిక ని గుర్తించి,ఆమె తల్లికి అప్పగించిన సిబ్బందిని అభినందించారు.
previous post
next post

