ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ సూచనల మేరకు, జిల్లా కలెక్టర్ మరియు మెజిస్ట్రేట్ ఆదేశాలతో శెట్టివారిపల్లి చెరువుకు నీటిని నింపే అంశంలో శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు ప్రారంభమయ్యాయి.పై అధికారుల ఆదేశాలతో నీటిపారుదల శాఖ అధికారులు శెట్టివారిపల్లి చెరువు వద్దకు చేరుకుని వాటర్ లెవల్స్ను పరిశీలించారు. చెరువుకు నీటి సరఫరా మెరుగుపరిచేందుకు చేపట్టాల్సిన పనులపై అంచనాలు సిద్ధం చేస్తున్నారు.ఈ చర్యలతో భవిష్యత్తులో చెరువుకు నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించే అవకాశముందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

