ఇంట్లో భర్త అనారోగ్యంతో మంచానపడి ఉన్నాడు. పిల్లలు అమాయకంగా నిద్రలో ఉన్నారు. అలాంటి సమయంలో కుటుంబానికి ధైర్యం చెప్పాల్సిన ఓ ఇల్లాలు మాత్రం ఫోన్ స్క్రీన్లో అపరిచితులతో ‘బోల్డ్’ చాటింగ్లలో మునిగిపోతే..? ఇది కేవలం వ్యక్తిగత విషయం కాదు.. కుటుంబ భవిష్యత్తును కుదిపేసే ప్రమాద సంకేతమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.స్మార్ట్ఫోన్ మనిషిని ప్రపంచానికి దగ్గర చేసింది. కానీ అదే ఫోన్ కొందరి జీవితాల్లో చిచ్చు పెడుతోందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ముఖ్యంగా మధ్య వయస్సు మహిళలు, పురుషులు ఒంటరితనం, మానసిక ఒత్తిడి లేదా “నా టైమ్” పేరుతో అపరిచితులతో చాటింగ్లలో ఇరుక్కుపోయి చివరికి సైబర్ ముఠాల బారిన పడుతున్న ఘటనలు పెరుగుతున్నాయని చెబుతున్నారు.
⚠️ రెండు నిమిషాల చాట్.. జీవితాంతం బాధ?“ప్రైవేట్ చాట్” అనుకునే సంభాషణలు అసలు ప్రైవేట్ కావని సైబర్ నిపుణులు చెబుతున్నారు. ఒక ఫోటో.. ఒక వీడియో కాల్.. కొన్ని బోల్డ్ మెసేజ్లు చాలు.. స్క్రీన్షాట్లు, స్క్రీన్ రికార్డింగ్లతో బ్లాక్మెయిల్ మొదలవుతుంది.“మీ కుటుంబానికి పంపిస్తాం.. భర్తకు చెబుతాం” అంటూ లక్షలు డిమాండ్ చేసే సైబర్ ముఠాలు నగరాల్లో యాక్టివ్గా ఉన్నట్లు సమాచారం.
🤔 ఒంటరితనానికి ఇదే పరిష్కారమా?జీవితంలో ఒత్తిడులు అందరికీ ఉంటాయి. కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, భావోద్వేగ ఒంటరితనం కూడా సహజమే. కానీ దానికి పరిష్కారం ప్రమాదకరమైన ఆన్లైన్ సంబంధాలు కాదని నిపుణులు చెబుతున్నారు. పుస్తకాలు, ఆధ్యాత్మికత, కుటుంబ సభ్యులతో మాట్లాడటం లేదా కౌన్సిలింగ్ తీసుకోవడం వంటి మార్గాలు మేలు చేస్తాయని సూచిస్తున్నారు.
👨👩👧👦 పిల్లలపై ప్రభావం?తల్లిదండ్రుల ప్రవర్తన పిల్లలపై ప్రభావం చూపుతుందని నిపుణులు గుర్తుచేస్తున్నారు. కుటుంబంలో నమ్మకం, పరస్పర గౌరవం, డిజిటల్ బాధ్యత ఎంతో అవసరమని చెబుతున్నారు.ఒక క్షణిక నిర్ణయం.. ఎన్నో ఏళ్లుగా కాపాడుకున్న కుటుంబ బంధాలను ప్రమాదంలోకి నెట్టొచ్చు. డిజిటల్ ప్రపంచంలో అడుగు వేయేముందు ఒక్కసారి ఆలోచించడం మంచిదే..!

