కడప /ప్రొద్దుటూరు తెలుగుదేశంపార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నంద్యాల వరదరాజులరెడ్డి సమక్షంలో గోపవరం పంచాయితీ ద్వారకానగర్ యానాది వాసులు స్థానిక నాయకుడు కుళయప్ప ఆధ్వర్యంలో 100 మంది కార్యకర్తలు తెలుగుదేశంపార్టీలో చేరడం జరిగినది , వారందరికీ పార్టీ కండువలు వేసి ఆహ్వానించిన అభ్యర్థి వరదరాజులరెడ్డి, రాష్ట్ర కార్యనిర్వహణా కార్యదర్శి సియం సురేష్ నాయుడు, మాజీ మున్సిపల్ చైర్మన్ ముక్తియార్, నాయకులు నల్లబోతుల నాగరాజు తదితరులు.అనంతరం పార్టీలో చేరిన నాయకుడు మాట్లాడుతూ గతంలో వరదరాజులరెడ్డి గారి పాలన చూసామాని ప్రొద్దుటూరులో అభివృద్ధి జరగాలన్న శాంతిభద్రతలు ఉండాలన్న వరదరాజులరెడ్డి ఎమ్మెల్యేగా ఉండాలని వార్డులో కష్టపడి పనిచేసి ఎమ్మెల్యేగా పెద్దాయనను గెలిపించుకుంటామని చెప్పారు
previous post
next post

