Tv424x7
Telangana

గజ్వెల్ లో రంజాన్ ఉత్సవం లో పాల్గొన్న ఎంపీ అభ్యర్థి పి.వెంకట్రామరెడ్డి

గజ్వేల్ నియోజకవర్గం సత్య నిష్ట, ధర్మాచరణ, దానధర్మాలు, ఉపవాస దీక్షలతో పవిత్రంగా రంజాన్ మాసం ముగిసి.. ఈదుల్ ఫితర్ ను భక్తి శ్రద్ధలతో జరుపుకొంటున్న ముస్లీం సోదర, సోదరి మణులకు మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి మాజీ కలెక్టర్, ఎమ్మెల్సీ పి వెంకట్రామరెడ్డి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.. గజ్వెల్ పట్టణంలోని ఈద్గాలో జరిగిన రంజాన్ వేడుకల్లో రాష్ట్ర ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి తో కలిసి పాల్గొన్నారు.. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ పవిత్ర మాసం మీ ఆశలు నెరవేర్చాలని కోరుకుంటున్నామని, జీవితంలో ఎదురయ్యే ప్రతి కష్టాన్ని అధిగమించే శక్తి , శాంతి, శ్రేయస్సును భగవంతుడు మీకు ప్రసాదించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు, ఈసందర్భంగా ముస్లీం సోదరులను అలాయ్ బలాయ్ చేసుకొని ఈద్-ఉల్-ఫితర్ శుభాకాంక్షలు..తెలియజేశారు.ప్రేమ, దయ, సహనం, సంతోషాల కలయికే రంజాన్ మాసమని, మీరంతా అల్లా దయతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు..అనంతరం టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు విరహత్ అలీ నివాసంలో వారిని కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. రంజాన్ విందును స్వీకరించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాజమౌళి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, వైస్ ఛైర్మన్ జఖి ఉద్దీన్, మజీద్ చైర్మన్ యూసుబ్, పార్టీ ప్రెసిడెంట్ నవాజ్ మీరా, వీరసత్ అలీ, ఇస్మాయిల్ తదితరులు పాల్గొన్నారు..

Related posts

జాగృతి లీడర్లను తయారు చేసుకుంటున్న కవిత !

TV4-24X7 News

పిల్లలకు విషమిచ్చి తల్లి ఆత్మహత్య

TV4-24X7 News

సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన టిడిపిపోలిట్ బ్యూరో సభ్యులు ఆర్ శ్రీనివాస రెడ్డి

TV4-24X7 News

Leave a Comment