Tv424x7
Telangana

గజ్వేల్ లో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం

సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో శుక్రవారం డిసిసి అధ్యక్షుడు నర్సారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు ప్రజ్ఞాపూర్ హరిత హోటల్ నుండి గజ్వేల్ వరకు ప్రధాన రహదారి మీదుగా భారీ బైక్ ర్యాలీ తో పెద్ద ఎత్తున కాంగ్రెస్ శ్రేణులతో కలిసి శోభ గార్డెన్ వరకు చేరుకుని అక్కడ కాంగ్రెస్ పార్టీ సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖ, మాజీ ఎమ్మెల్యే హన్మంతరావు,మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధు,యువజన కాంగ్రెస్ సిద్దిపేట జిల్లా అధ్యక్షురాలు ఆంక్షా రెడ్డి, పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాబోయే ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేస్తున్న నీలం మధు ను గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందని అధికార పార్టీ అభ్యర్థి గెలిస్తే ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందని బీజేపీ, బి ఆర్ ఎస్ పార్టీల మాటలు నమ్మే స్థితిలో ప్రజలు లేరని రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధు అఖండ విజయం ఖాయం అని అన్నారు

Related posts

ఫీల్డ్ అసిస్టెంట్పై చర్యలకు డిమాండ్

TV4-24X7 News

సూర్యాపేట-రాజమండ్రి వరకు నేషనల్ హైవే

TV4-24X7 News

గద్వాల – అయిజ రహదారిపై పోలీసుల ఉదారత

TV4-24X7 News

Leave a Comment