Tv424x7
Andhrapradesh

వడదెబ్బకు సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్ మృతి

శ్రీ సత్యసాయి జిల్లా ముదిగుబ్బ మండల కేంద్రానికి చెందిన ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ సోమవారం మృతి చెందాడు. ముదిగుబ్బ పాతూరుకు చెందిన మోపూరి ఎల్‌ఐసి చంద్రశేఖర్‌ కుమారుడు ఎం.ప్రణీత్‌కుమార్‌(24) సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిగా పని చేస్తున్నాడు. ఈయన ఇటీవల ఇంట్లో ఉండే విధులు నిర్వహిస్తున్నాడు. ఇందులో భాగంగా ఆదివారం వడదెబ్బకు గురయ్యాడు. వెంటనే కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం బెంగూళుకు తరలించారు. అక్కడ ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం నాడు ప్రణీత్‌కుమార్‌ మరణించాడు. దీంతో ఆ ప్రాంతమంతా ఒక్కసారిగా విషాదఛాయలు అలుముకున్నాయి.

Related posts

పాపవినాశనంలో బోటింగ్ ట్రయల్ రన్

TV4-24X7 News

వేధిస్తున్నాడని కొడుకును హత్య చేసిన తండ్రి..

TV4-24X7 News

క్యాన్సర్ బాదితునికి ఆర్థిక సహాయం చేసిన జి. కె ఫౌండేషన్

TV4-24X7 News

Leave a Comment