Tv424x7
Andhrapradesh

భూమా అఖిలప్రియ బాడీగార్డ్‌పై హత్యాయత్నం

నంద్యాల జిల్లా:మే 15నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో మాజీ మంత్రి భూమా అఖిలప్రియ బాడీగార్డ్‌ నిఖిల్‌పై హత్యాయత్నం జరిగింది. మంగళవారం అర్ధరాత్రి దాటాక ఈ ఘటన చోటు చేసుకుంది. అఖిలప్రియ ఇంటి ముందు నిఖిల్‌ నిలుచుని ఉండగా.. కారుతో దుండగులు ఆయన్ను ఢీకొట్టారు. అనంతరం ముగ్గురు వ్యక్తులు మారణాయు ధాలతో దాడి చేశారు. నిఖిల్‌ వారి నుంచి తప్పించుకుని అఖిలప్రియ ఇంట్లోకి వెళ్లిపోయారు. తీవ్రగాయాలతో ఉన్న అతడిని నంద్యాలలోని ఆస్పత్రికి తరలించారు.గతంలో నంద్యాలలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర సమయంలో టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డిపై నిఖిల్‌ దాడి చేశాడు. ఈ నేపథ్యంలోనే ఆయన వర్గీయులు తిరిగి దాడికి పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటన తో నేతల ఇళ్ల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు..

Related posts

టీడీపీ పార్ల‌మెంటు డిప్యూటీ ఫ్లోర్ లీడ‌ర్‌గా బైరెడ్డి శ‌బ‌రి

TV4-24X7 News

కాంగ్రెస్ లో చేరనున్న మాజీ మంత్రి..?

TV4-24X7 News

నేడు అసెంబ్లీలో పలు కీలక అంశాలపై చర్చ..!

TV4-24X7 News

Leave a Comment