Tv424x7
AndhrapradeshTelangana

గద్వాల – అయిజ రహదారిపై పోలీసుల ఉదారత

అయిజ పట్టణానికి సమీపంలోని కట్టకింది తిమ్మప్ప దేవాలయం నుంచి సిక్స్ వే వరకు ఉన్న గుంతలకు మట్టి తరలించి ఉదారతను చాటుకున్న పోలీసులు.బీటీ రహదారిపై మోకాటి లోతు గుంతలు పడటంతో వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయం తెలుసుకొని ఎస్సై విజయభాస్కర్ గుంతలకు మట్టి తరలించడంతో పాటు జెసిబి సహాయంతో చదును చేయించారు. బీటీ రోడ్డు రెన్యువల్ చేయాల్సిన అధికార యంత్రాంగం పట్టించుకోకపోవడంతో వాహన చోదకులు ప్రమాదాల బారిన పడుతున్నారు.ఎస్సై గుంతలకు మట్టిని తరలించడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆర్ అండ్ బి అధికారులు పట్టించుకోకపోయినా పోలీస్ శాఖ ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని గుంతలకు మట్టి తరలించడంతో ఎస్సై, సిబ్బందికి వాహన చోదకులు పట్టణ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు…

Related posts

నేడు ఆస్పత్రి నుంచి కేసీఆర్ డిశ్చార్జ్..

TV4-24X7 News

బీఆర్ఎస్ పార్టీలో వర్గ విభేదాలపై ఆ పార్టీ కీలక నేత, మాజీ మంత్రి హరీష్ రావు కీలక వాక్యాలు

TV4-24X7 News

పుర్రి దుర్గాప్రసాద్ కుటుంబాన్ని పరామర్శించిన వాసుపల్లి

TV4-24X7 News

Leave a Comment