లోక్సభ ఎన్నికల్లో భారతీయ జనతాపార్టీ విజయంపై ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ గెలిచే అవకాశం ఉందని, అయితే, కమలం నేతలు చెబుతున్నట్లు ఆ పార్టీకి 370 సీట్లు దాటకపోవచ్చని అంచనా వేశారు. ‘మోదీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి మరోసారి అధికారంలోకి వస్తుందని నేను భావిస్తున్నాను. 2019 ఎన్నికల్లో గెలిచిన సీట్లకంటే ఈసారి కొంచెం ఎక్కువ స్థానాలు గెలుచుకోవచ్చు. 370 సీట్లు మాత్రం దాటకపోవచ్చు’ అని అన్నారు.

previous post
next post