Tv424x7
Andhrapradesh

ట్రావెల్స్ బస్సు బోల్తా.. 20 మంది గాయాలు

పల్నాడు జిల్లా:జూన్ 01పల్నాడు జిల్లాలో ట్రావెల్స్ బస్సు బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో 20 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ సంఘటన శనివారం ఉదయం చోటు చేసుకుంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. చిలకలూరిపేట మండలం లింగంగుంట్ల వద్ద కామాక్షి ట్రావెల్స్ బస్సు బోల్తా కొట్టింది. కామాక్షి ట్రావెల్స్ బస్సు బోల్తా కొట్టిన తరుణంలోనే… బస్సులో ఉన్న 20 మందికి గాయాలు కాగా, ఇద్దరు పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు గుర్తించారు. ఈ సంఘటన జరిగిన వెంటనే పోలీసులు.. అక్కడి కి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాదు నుంచి ఒంగోలు కందుకూరు వెళ్తున్న సమయంలోనే కామాక్షి ట్రావెల్స్ బస్సు బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది…

Related posts

నేడు ఆర్థిక శాఖపై సీఎం జగన్ సమీక్ష

TV4-24X7 News

వారు నాకు శత్రువులు కాదు నా శిష్యులే:కేఏ పాల్

TV4-24X7 News

జీతాలు జూలై లో పెంచుతాం విధుల్లో చేరకుంటే కొత్తవారిని తీసుకుంటాం: సజ్జల

TV4-24X7 News

Leave a Comment