ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు బయల్దేరారు. రేపు ఉదయం 10.15 గంటలకు ప్రధాని మోదీతో సీఎం భేటీ అవ్వనున్నారు. రాష్ట్రానికి ఆర్థిక సాయం, ఇతర అంశాలను ప్రధానికి వివరించనున్నారు. ప్రధానితో భేటీ అనంతరం హోం మంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్లతో వేర్వేరుగా చంద్రబాబు సమావేశం కానున్నారు. పోలవరం, అమరావతి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఆర్థిక మంత్రికి నివేదిక ఇవ్వనున్నారు

previous post