‘తెలంగాణలో నెలకు 200 యూనిట్ల ఉచిత కరెంట్ సరఫరా చేసే ‘గృహజ్యోతి’ పథకంలో లోపాల సవరణలకు, దరఖాస్తుల నమోదుకు అవకాశం కల్పిస్తున్నట్లు దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ సీఎండీ ముషారఫ్ ఫరూఖీ తెలిపారు. గతంలో ప్రజాపాలన కార్యక్రమంలో వినియోగదారులు అందజేసిన దరఖాస్తుల్లో విద్యుత్ కనెక్షన్ నంబరును తప్పుగా నమోదు చేసినవారికి సవరణ అవకాశం కల్పించి జీరో బిల్లులు జారీ చేస్తామని వివరించారు.

next post