Tv424x7
Andhrapradesh

తిరుపతి జిల్లాలో మరో మానవ మృగానికి 8 ఏండ్ల చిన్నారి బలి

తిరుపతి జిల్లా లో గంజాయి మత్తులో ఉన్న మానవ మృగానికి మరో చిన్నారి బలైంది.బిస్కెట్లు ఇస్తానని చెప్పి ఎనిమిదేండ్ల చిన్నారిని తీసుకెళ్లి ఆమెపై లైంగికదాడి చేసి, హతమా ర్చాడు. ఈ అమానవీయ ఘటన తిరుపతి జిల్లా దొరవారిసత్రం మండలంలో బుధవారం సాయంత్రం చోటు చేసుకుంది.బిహార్‌ నుంచి వచ్చిన కొన్ని కుటుంబాలు మండలంలోని ఓ గ్రామ రైస్‌మిల్లులో పనిచేసే ఒక దంపతుల రెండో కుమార్తె (8)ను అదే మిల్లులో పనిచేస్తున్న బిహార్‌కు చెందిన దిలీప్‌(20) బిస్కెట్లు ఇప్పిస్తానని చెప్పి ఉదయం తీసుకెళ్లాడు. మధ్యాహ్నం మిల్లు నుంచి వచ్చిన తల్లిదండ్రులకు చిన్నారి కనిపించకపోయే సరికి ఆందోళనకు గురై చుట్టుపక్కల వెతికారు. సాయంత్రం 4 గంటల సమయంలో మిల్లు సమీపంలోని అటవీ ప్రాంతంలో మేకల కాపర్లు బాలిక మృతదేహాన్ని చూసి.. స్థానికులు, పోలీసులకు సమాచారం ఇచ్చారు.వెంటనే డీఎస్పీ శ్రీనివాస రెడ్డి, సీఐలు జగన్మోహన్‌ రావు, శ్రీనివాసులురెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. బాలిక నోటితోపాటు పలు శరీర భాగాల్లో గాయాలు గమనించారు. నిందితుడు లైంగికదాడికి పాల్పడి, అనంతరం హత్య చేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నా

Related posts

మెడికల్ ఖర్చులకు రూ 10 వేలు ఆర్థిక సాయం చేసిన వాసుపల్లి

TV4-24X7 News

ఏపీలో వాట్సాప్ ద్వారా ఈ నెలాఖరుకు 100 సేవలు: మంత్రి లోకేశ్

TV4-24X7 News

నిర్లక్ష్యం కారణంగా ముక్కు పచ్చలారని పసి బాలుడు మృతి

TV4-24X7 News

Leave a Comment