వైఎస్ఆర్ జిల్లా /కమలాపురం మండల పరిధిలోని సచివాలయాల్లో నిర్లక్ష్యం అలుముకుంది. మధ్యాహ్నం కావస్తున్నా కార్యాలయాల్లో ఖాళీ కుర్చీలే దర్శనమిస్తున్నాయి. సచివాలయాల్లో విధులు నిర్వహిస్తున్న ఏ ఒక్క అధికారి కూడా సమయపాలన పాటించడం లేదనే విమర్శలు పెద్ద ఎత్తున్న వినిపిస్తున్నాయి. పలు పనుల కోసం వస్తున్న ప్రజలు విసిగెత్తి అసహనంతో వెనుదిరుగుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి సమయపాలన పాటించేలా చూడాలని ప్రజలు వేడుకొంటున్నారు.
previous post

