విశాఖపట్నం శ్రీ స్వామి వివేకానంద సంస్థ వారి ఆధ్వర్యంలో ఫాదర్స్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. వివేకానంద సంస్థ అనాధ ఆశ్రమంలో ఆశ్రయం పొందుతున్న తండ్రులను,సి హెచ్ . సూర్యనారాయణ, నాగేశ్వరరావు ను వివేకానంద సంస్థ గౌరవ అధ్యక్షులు డాక్టర్.సి .ఎం .ఎ . జహీర్ అహ్మద్ సాలువలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా డాక్టర్ మాట్లాడుతూ, ప్రతి ఒక్కరు కూడా మనకి జీవితాన్నిచ్చిన తల్లిదండ్రులను గౌరవించాలని, ఫాదర్స్ డే సందర్భంగా ఈ తండ్రులకు సన్మానం చేయడం, నా అదృష్టంగా భావిస్తున్నానని, ఎంతోమంది తల్లిదండ్రులకు ఆశ్రయం కల్పిస్తూ, వారికి భరోసాగా నిలబడ్డ సంస్థ వారిని, సంస్థ సభ్యులను అభినందించారు. ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షులు అప్పారావు , సంస్థ సభ్యులు అప్పలకొండ, సోంబాబు మరియు సంస్థ మహిళా సభ్యులు ఉమాదేవి, రాణి, రత్న, సుజాత , ట్యూషన్ విద్యార్థులు పాల్గొన్నారు.

