Tv424x7
Andhrapradesh

జన సైనికులుగా మారనున్న 30 మంది కార్పోరేటర్లు

జీవీఎంసీలో వైసీపీకి చెందిన సుమారు 30 మంది కార్పొరేటర్లు పార్టీ మారే యోజన వీరంతా దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ ఆధ్వర్యంలో జనసేన పార్టీలో చేరిక రెండు రోజుల్లో మూకుమ్మడిగా ప్రకటన చేయనున్న కార్పోరేటర్లువిశాఖపట్నం గ్రేటర్ విశాఖలో జనసేన పార్టీకి నూతన జవసత్వాలు అందించేందుకు దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే జనసేన నేత వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ నడుం బిగించారు. ఈ నేపద్యంలో జీవీఎంసీ కి చెందిన వైసిపి పార్టీ నుంచి గెలిచిన 30 మంది కార్పొరేటర్ల జనసేన పార్టీలోకి చేర్చ డానికి అన్ని ప్రయత్నాలు చేశారు వీరిలో ఉన్న సమ్మతిని తనకు అనుకూలంగా మార్చుకొని జనసేన పార్టీలోకి వీరిని ఆహ్వానించినట్టుగా తెలుస్తోంది వీరంతా ఎందుకు సుముఖత వ్యక్తం చేశారు గ్రేటర్ విశాఖపట్నం సాధించడానికి ఈ 30 మంది కార్పొరేటర్లు పార్టీలో చేరితే కలిసి వస్తుందని భావిస్తున్నారు దాదాపుగా 30 వార్డుల్లో జనసేన పార్టీ దిగ్విజయంగా ఎగరడానికి కార్పోరేటర్ల రాకతో సాధ్యపడుతుందని వంశీకృష్ణ భావిస్తున్నారు వేగవంతంగా జనసేన పార్టీని నగరంలో మరింత పట్టిష్టవంతంగా తీర్చిదిద్దడానికి ఎమ్మెల్యే తన ప్రయత్నం చేశారు ప్రస్తుతం జీవీఎంసీలో వైసిపి అధికారపక్షంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే మెజార్టీ వైసీపీ సభ్యులు కార్పొరేటర్లుగా ఉన్న ఇందులో 30 మంది కార్పొరేటర్లు జనసేనలో చేరితే అవిశ్వాసం పెట్టి వైసిపి కి చెందిన మేయర్ ని దించేందుకు పాములు గడుపుతున్నారు.కూటమి అభ్యర్థి తరపున ఒకరిని మేయర్గా నిలబెట్టేందుకు మీరు ఇటు తెలుగుదేశం అటు బిజెపి కూడా తమ ప్రయత్నాలను మొదలుపెట్టారు మూకుమ్మడిగా వైసిపికి చెందిన మేని దంచడానికి వీరంతా పక్క ప్రణాళిక రూపొందిస్తున్నారు. అందులో భాగంగానే దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ ఓడుగు ముందుకేసి అసమతిలో ఉన్న 30 మంది కార్పొరేటర్లు జనసేన పార్టీలోకి ఆహ్వానించారు వీరికి అన్ని విధాలుగా పార్టీ నుంచి మంచి జరిగే లాగా చూస్తానని హామీ ఇవ్వడంతో మీరంతా జనసేన పార్టీలోకి చేరడానికి ఇష్టపడుతున్నారు రెండు మూడు రోజుల్లో మీరంతా తమ నిర్ణయాన్ని పత్రిక ముఖంగా ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇప్పటికే దక్షిణ నియోజకవర్గంలో పూర్తిస్థాయి పట్టు సాధించిన వంశీకృష్ణ నగరంలో జనసేన పార్టీని మరింత విస్తరించడానికి ఈ కార్పొరేటర్ల చేరిక దోహదపడుతుందని భావిస్తున్నారు.

Related posts

పోలీసుల విస్తృత తనిఖీలు గంజాయి అక్రమ రవాణా అరికట్టేందుకు చర్యలు

TV4-24X7 News

గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం

TV4-24X7 News

కాలేజ్ భవనం పై నుంచి దూకి విద్యార్థిని ఆత్మహత్య కారణమేంటి..?

TV4-24X7 News

Leave a Comment