విశాఖపట్నం శంకర్ ఫౌండేషన్ కంటి ఆసుపత్రి వారి ఆధ్వర్యంలో, హైటెక్ వెల్ఫేర్ సొసైటీ సభ్యులు మహమ్మద్ యాసీన్( బాబ్జి) , క్యాప్ కోఆర్డినేటర్ వై . రాజు ఆధ్వర్యంలో, ఆగస్టు 3 వ తేదీ శనివారం ఉదయం 9 గంటల నుండి, మధ్యాహ్నం 2 గంటల వరకు ఓల్డ్ పోస్ట్ ఆఫీస్ దగ్గర, ఫెర్రీ రోడ్డు, పొట్టి శ్రీరాములు కళ్యాణ మండపంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నారు. ఈ వైద్య శిబిరంలో కంటికి సంబంధించిన వ్యాధులకు తనిఖీలు చేసి, అవసరమైన వారికి ఉచితంగా ఆపరేషన్లు కూడా చేయబడును. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం.
