Tv424x7
Andhrapradesh

పింగళి వెంకయ్య 148 వ జయంతి వేడుకలు మరియు భారీ జెండా ర్యాలీని ఘనంగా నిర్వహించిన వివేకానంద సంస్థ

విశాఖపట్నం జెండా రూపకర్త పింగళి .వెంకయ్య జయంతిని శ్రీ స్వామి వివేకానంద సంస్థ వారు ఘనంగా నిర్వహించారు, మరియు 100 అడుగుల భారీ జెండా ర్యాలీని, శ్రీ స్వామి వివేకానంద సంస్థ గౌరవ అధ్యక్షులు డాక్టర్.సి .ఎం .ఎ . జహీర్ అహ్మద్, ఆంధ్ర తెలంగాణ ఉమ్మడి రాష్ట్రాల రౌండ్ టేబుల్ సంస్థ చైర్మన్ మక్సుద్ అహ్మద్ వివేకానంద సంస్థ నుండి, రాణి బొమ్మ వరకు ఈ భారీ జెండా ర్యాలీని ప్రదర్శించారు. ఈ సందర్భంగా డాక్టర్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పింగళి. వెంకయ్య జయంతిని అధికారికంగా నిర్వహించాలని, మరియు వెంకయ్య విగ్రహాన్ని పార్లమెంటులో ప్రవేశపెట్టాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో వివేకానంద సంస్థ అధ్యక్షులు అప్పారావు, సంస్థ సభ్యులు గజపతి స్వామి,జి లక్ష్మణ్,యూ . ఎల్లాజీ,పి . అప్పలకొండ,డి . సత్తిబాబు, మరియు పి . సత్యవంతరావు సంస్థ మహిళా సభ్యులు ఉమాదేవి, సుజాత, రాణి, కనకమహాలక్ష్మి, రాజేశ్వరి, రమా ప్రియ, జనని మరియు అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.

Related posts

మాజీ సీఎంతో వాసుపల్లి భేటీ

TV4-24X7 News

నేటి నుంచి RBI కొత్త రూల్స్!!

TV4-24X7 News

పెద్దపల్లిలో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.. కొనసాగుతున్న సహాయక చర్యలు..

TV4-24X7 News

Leave a Comment