Tv424x7
Telangana

తెలంగాణ హైకోర్టుకు ఇద్దరు కొత్త న్యాయమూర్తులు

హైదరాబాద్‌:ఆగస్టు 14తెలంగాణ హైకోర్టుకు కొత్తగా ఇద్దరు న్యాయమూర్తుల నియామకం జరిగింది. మధ్యప్రదేశ్‌ హైకోర్టు జడ్జిగా ఉన్న జస్టిస్‌ సుజయ్‌ పాల్‌, కొల్‌కతా హైకోర్టు న్యాయ మూర్తి జస్టిస్‌ మౌసమీ భట్టాచార్యలు రాష్ట్ర ఉన్నత న్యాయస్థానానికి బదిలీ అయ్యారు. ఈ మేరకు కేంద్ర న్యాయ మంత్రిత్వశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.కేరళ హైకోర్టు న్యాయమూరిశ్త జస్టిస్‌ అను శివరామన్‌ను కర్ణాటక హైకోర్టుకు బదిలీ చేశారు. సుప్రీంకోర్టు కొలీజియం గత నెలలో జస్టిస్‌ మౌసమీ భట్టాచార్య బదిలీకి సంబంధించి కేంద్రానికి సిఫారసు చేసింది. కాగా మధ్యప్రదేశ్‌ హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్‌ సుజయ్‌ పాల్‌ తనను బదిలీ చేయాలని కొలీజియానికి విన్నవించిన విషయం తెలిసిందే. సుప్రీం కోర్టు కొలీజియం సిఫార్సుల ఆధారంగా వీరి బదిలీకి రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు…

Related posts

కోట్లు వసూలు చేసిన ప్రైవేట్ లిమిటెడ్ ఉందా…? మూసేశారా?

TV4-24X7 News

రేవంత్ రెడ్డి ఇంటి వద్ద భద్రత పెంపు

TV4-24X7 News

ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేద్దాం: కేసీఆర్‌

TV4-24X7 News

Leave a Comment