Tv424x7
National

హ్యాట్రిక్‌ ‌విక్టరీతో ఆశీర్వదించండి

కురుక్షేత్రలో జరిగిన ర్యాలీలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ* కేంద్రంలో వరుసగా మూడోసారి ప్రజాసేవ చేసేందుకు తనను ఆశీర్వదించిన ప్రజలు హర్యానా లోనూ బీజేపీ కి ‘హ్యాట్రిక్‌’ ‌విజయాన్ని అందించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కోరారు. హర్యానా ప్రజల ఉత్సాహాన్ని చూస్తే బీజేపీని తిరిగి గెలిపించాలనే కృతనిశ్చయంతో ఉన్నట్టు చెప్పగలనని అన్నారు. హర్యానా అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కురుక్షేత్రలో జరిగిన ర్యాలీలో మోదీ శనివారంనాడు పాల్గొని ప్రసంగించారు.రైతులు, పేదలు, యువకులు, మహిళలకు లబ్ధి చేకూర్చేందుకు కేంద్రం ఇటీవల తీసుకున్న పలు నిర్ణయాలను మోదీ ఈ సందర్భంగా ప్రస్తావించారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోపై రైతులు, పేదలు, యువకులు, మహిళలకు లబ్ధి చేకూర్చేందుకు భారీ నిర్ణయాలు తీసుకుంటామని నేను వాగ్దానం చేశాను. ఇంకా 100 రోజులు కూడా పూర్తికాకుండానే రూ.15 లక్షల కోట్ల పథకాలను మా ప్రభుత్వం ప్రారంభించింది. పేద కుటుంబాలకు 3 లక్షల పక్కా గృహాలకు ఆమోదం తెలిపాం’ అని మోదీ తెలిపారు.హర్యానాలో బీజేపీ ప్రభుత్వం పనితీరుతో పొరుగున ఉన్న హిమాచల్‌ ‌ప్రదేశ్‌లోని కాంగ్రెస్‌ ‌సర్కార్‌తో మోదీ పోల్చారు. హిమాచల్‌ ‌ప్రదేశ్‌లో కాంగ్రెస్‌ ‌పార్టీ తప్పుడు వాగ్దానాలు చేసిందన్నారు. ఫలితంగా వేతనాల కోసం ప్రభుత్వ ఉద్యోగులు నిరసలకు దిగుతున్నారని అన్నారు. కాగా, హర్యానాలోని 90 అసెంబ్లీ స్థానాలకు అక్టోబర్‌ 5‌న పోలింగ్‌ ‌జరుగనుంది. అక్టోబర్‌ 8‌న ఫలితాలు వెలువడతాయి.

Related posts

తమిళనాడులో భారీ వర్షం

TV4-24X7 News

ఆషాఢంలో దుర్గమ్మ ఆరాధన ఎందుకంత ప్రాముఖ్యత?- సారె మహోత్సవం వెనుక కథేంటి?

TV4-24X7 News

నేటి నుంచే టీమ్ ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య రెండో టెస్ట్..!!

TV4-24X7 News

Leave a Comment